Coronavirus: India reports record 28,498 cases in a day దేశంలో 24గంటల్లో 28,498 కేసులు, 553 మంది మృతి

Coronavirus cases in india tally nears 9 lakh more than 23727 dead

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

With a record 28,498 coronavirus cases reported in the past 24 hours, the total count in India has risen to 9,06,752‌. The death toll has gone up to 23,727 as Covid-19 claimed 553 lives in 24 hours. According to Health Ministry figures released today morning, 5,71,460 have recovered so far while there are 3,11,565 active cases in the country.

దేశంలో కరోనా ఉగ్రరూపం: తొమ్మిది లక్షలు దాటిన కరోనా కేసులు.. 23,727 మరణాలు

Posted: 07/14/2020 12:22 PM IST
Coronavirus cases in india tally nears 9 lakh more than 23727 dead

(Image source from: Business-standard.com)

దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత పక్షం రోజులుగా తన రికార్డులను తానే బద్దలు చేసుకున్నట్లు అంతకంతకూ అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి, గత వారం రోజులుగా 20 వేల మార్కుకు పైబడిన కేసులు తాజాగా 28 వేల మార్కుకు చేరువలోగా నమోదయ్యాయి. ఓ వైపు తన వ్యాప్తిని అంతకంతకూ పెంచుకుంటూ ఏకంగా తొమ్మిది లక్షల మార్కును దాటేసింది. అదే సమయంలో మరణాలను కూడా పెంచేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది.

రోజురోజుకూ తనవ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో మూడవ స్థానంలో భారత్ నిలిచింది. ఇక దేశంలో మరణాలు కూడా ఏకంగా ఇరవై మూడు వేల మార్కును దాటేసాయి. దీంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన ఏడవ దేశంగా నమోదైంది. గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. అన్ లాక్ 1.0 అమల్లోకి వచ్చిన జూన్ 7 నుంచి రోజుకు ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కాగా, తాజాగా ఇవాళ 28 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో నిన్న నమోదైన అత్యధిక కేసుల కన్నా ఇవాళ నమోదైన కేసులు రెండో అత్యధికంగా వుండటం.. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం దేశప్రజల్లో అందోళన మరింత తీవ్రమైంది.

దేశంలో క్రమంగా జడలువిప్పుతున్న కరోనా మహమ్మారి ఏకంగా తొమ్మిది లక్షల మార్కును అధిగమించాయి. కరోనా పాజిటివ్ కేసులు ఉద్దృతి పెరుగుతున్న ఈ క్రమంలో కొంచెం కఠిన నిబంధనలు పెట్టాల్సిన కేంద్రం అన్ లాక్ 2.0 మార్గదర్శకాలలో రాకపోకలకు వెసలుబాటు కల్పించడం కూడా తీవ్రతను పెంచేందుకు కారణం అవుతుందన్న వాదనలు వినబడుతున్నాయి. గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా ఏకంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. ప్రతీ రోజు మూడు వందలకు పైబడిన సంఖ్యలో నమోదైన మరణాలు.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 500 మరణాలు నమోదయ్యాయి, దేశంలో జులై 1 అన్ లాక్ 2.0 నుంచి అమల్లోకి రావడంతో రాకపోకలకు అనుమతులు లేకుండా చేసింది.

దీంతో పరిమిత సంఖ్యలోనే తిరిగిన వాహనాలు ఇకపై పూర్తిస్థాయిలో రోడ్డును ఎక్కనున్నాయి. మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాలకు అన్ లాక్ 1.0 తలుపులు తెరిచింది. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 28,498 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 9,06,752‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులలోనే నమోదయ్యాయి, వీటితో పాటు ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలలోనూ తాజాగా గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి, వీటితో పాటు దేశంలో నిన్న ఏకంగా 500 మరణాలు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య ఇరవై ఒక్క వేల మార్కును దాటాయి. తాజాగా నమోదైన మరణాల సంఖ్య ఏకంగా 23,727కు చేరింది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్ర ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 5,71,460 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 3,11,565 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 64 శాతంగా నమోదైంది.

మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా ఉద్దృతి భారీగా పేరుగుతోంది. దేశంలో నమోదైన మొత్తంలో తొమ్మిది లక్షల కరోనా కేసులలో సమారు మూడున్నర లక్షల కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఇక దేశంలోని మరణాలలోనూ ఈ రెండు రాష్ట్రాల నుంచే అధికం. మహారాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండం చేస్తుండంతో అక్కడి సామాన్య ప్రజల జీవినం స్థంభించింది. మహారాష్ట్రలోని దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా మహమ్మారి తన పంజాను విసురుతూ వేలాది మందిపై ప్రభావాన్ని చూపుతోంది. ఇక తాజాగా తమిళనాడులోనూ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. దీంతో దేశంలో లక్షకు పైగా కరోనా కేసుల నమోదు చేసుకున్న రెండో రాష్ట్రంగా మారింది. తమిళనాడుతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles