covid 19: 704 fresh cases reported in AP ఏపీలో ఒక్క రోజులో 704 కేసులు.. ఏడు మరణాలు

Coronavirus in ap 704 new covid 19 cases state tally crosses 14 thousand mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh nears 14000 Mark after 704 new cases were reported in the last 24 hours, out of which 6511 have so far recovered and have been discharged, while 187 have died, the state health department said.

ఏపీలో కరోనా ఉదృతి.. ఒక్క రోజులో 704 కేసులు.. ఏడు మరణాలు

Posted: 06/30/2020 02:31 PM IST
Coronavirus in ap 704 new covid 19 cases state tally crosses 14 thousand mark

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాదిమందిని తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు పద్నాలుగు వేల మార్కుకు చేరువలో ఉన్నాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా వారం రోజులుగా ఐదు వందల మార్కుకు పైగానే సాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా పద్నాలుగు వేల మార్కును అధిగమించడం అందోళనకరం, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజూ ఐదు వందలకు పైబడి నమోదువుతున్న కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏడు వందలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా పదకొడు వేల మార్కుకు చేరువలో వుంది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 704 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు పద్నాలుగు వేల మార్కును అధిగమించింది. రాష్ట్రంలో మొత్తంగా 14,595 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చినవారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా వున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చినవారు 51 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. మొత్తంగా 56గా నమోదయ్యాయి. రాష్ట్రంలో మాత్రం 648 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 107 కేసులు, ఆనంతపురంలో 104, కృష్ణా లో 84, కర్నూలులో 82, కడప జిల్లాలో 75 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇక గుంటూరు జిల్లాలో 58, తూర్పు గోదావరి జిల్లాలో 55, ప్రకాశం జిల్లాలో 31 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 26, నెల్లూరు జిల్లాలో 5, విజయనగరంలో 13, పశ్చిమ గోదావరిలో ఏడు, శ్రీకాకుళంలో ఒక్క  కేసు నమోదయ్యాయి, అయితే ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు మాత్రమే నమోదు కావడం కొంత ఊరటనిస్తోంది, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి పదిమంది అసువులు బాసారు.  కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో  ఏడుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, అనంతపురం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 187కి చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాబారిన పడి కోలుకున్న పేషంట్లను వైద్యాధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6511కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 7897కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 396గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 1997కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles