COVID-19 | 105 fresh cases reported in AP ఏపీలో 3676 చేరిన కరోనా కేసులు.. 105 మరణాలు

Coronavirus in ap 105 new covid 19 cases state tally reaches 3676

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh rose to 3676 after 105 new cases were reported in the last 24 hours, out of which 2169 have so far recovered and have been discharged, while 68 have died, the state health department said.

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడిచిన 24 గంటల్లో 105 కేసులు..

Posted: 06/01/2020 06:41 PM IST
Coronavirus in ap 105 new covid 19 cases state tally reaches 3676

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంతో కాసింత వేగాన్ని తగ్గించుకున్న కరోనా వ్యాప్తి.. మళ్లీ విజృంభిస్తోంది. 105 కేసులు నమోదయ్యాయి. ఇక అంతకుముందు వారం పది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 105 కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా నమోదైన 105 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3676 మార్కును చేరువలో వుంది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాలో 8 తమిళనాడు కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగతా కేసులు పలు జిల్లాల్లో్ వెలుగుచూసిన కాంట్రెక్టు కేసులని సమాచారం, ఇప్పటివరకు పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలపి 3676 మందికి కరో్నా వ్యాప్తి చెందినదని అధికారులు విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారని సమాచారం. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 68కి చేరింది.

రాష్ట్రంలో కొత్తగా నమదైన పాజిటివ్ కేసుల్లో తమిళనాడు రాజధాని చెన్నైలోని కోయంబేడు మార్కెట్ సంబంధాలు వున్నాయని సమాచారం. తాజాగా నమోదైన 105 కేసుల్లో ఎనమిది కేసులు కూడా మార్కెట్ తో వచ్చిన కాంటాక్టు కేసులని అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2169కు చేరడం కూడా రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. ఇక తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 885గా ఉంది. ఈ తరుణంలో జూన్ మాసం నుంచి ప్రారంభమయ్యే వర్షాకాలంలో కరోనావ్యాప్తికి మరింత అనుకూలంగా వుంటాయన్న అంచనాలతో రాష్ట్రవాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles