India crosses 1000 Covid-19 deaths దేశంలో 1000 మార్కు దాటిన కరోనా మరణాలు..

Coronavirus india crosses 1000 covid 19 deaths 73 deaths in last 24 hours

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India's COVID-19 count have crossed the grim milestone of 30,000-mark today, according to the ministry of health and family welfare. The states have recorded over 1,897 cases in last 24 hours, highest number of fresh cases reported in a single day since the pandemic. The total number of coronavirus cases in India stood at 31,332.

దేశంలో 1000 దాటిన కరోనా మరణాలు.. 24 గంటల్లో 73 మరణాలు

Posted: 04/29/2020 09:51 AM IST
Coronavirus india crosses 1000 covid 19 deaths 73 deaths in last 24 hours

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో అత్యధికంగా 1897 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా, మరోవైపు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 73 మరణాలు సంభవించడంతో పాటు ఏకంగా దేశంలో వెయ్యి మరణాలు నమోదుకావడం అందోళన కలిగించే అంశం. లాక్ డౌన్ అమల్లో వుండగానే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతుండటం కూడా దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1897 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ్టి ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల 31 వేల మార్కు దాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 31 వేల 332 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి అసువులు బాసిన వారి సంఖ్య కూడా వెయ్యి మార్కు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 73 మందిని పోట్టన బెట్టుకుంది. దీంతో మరణాల సంఖ్య కూడా 1007కు చేరింది. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం.

ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 7696 మంది కోలుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 22, 629గా నమోదైంది.  గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 31 మంది, గుజరాత్ లో 19 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 7696 మంది కోలుకోగా మరో 22,629 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారిశాతం 24.56గా ఉండటం ఊరటకలిగిస్తోంది.

దేశంలో అత్యధికంగా కొవిడ్‌-19 తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9318 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మరణాల సంఖ్య కూడా 400 మార్కు దాటింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 31 మరణాలతోపాటు 728 పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9318 చేరగా 400మంది మృత్యువాతపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. పుణె, నాగ్‌పూర్లో కూడా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదువుతున్నాయి. మహారాష్ట్ర అనంతరం అత్యధికంగా కరోనా మరణాలు గుజరాత్లో చోటుచేసుకుంటున్నాయి.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3744కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 181 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజు వ్యవధిలోనే గుజరాత్ లో 19 మంది అసువులు బాసారు. తాజాగా నమోదైన కొత్త కోవిడ్ కేసులతో మొత్తం కేసులు సంఖ్య 3744కు చేరింది, మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2387 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 120మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3314 మందికి కరోనా సోకగా 54మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles