అవసరం ఎవరిచేతైనా కొత్త అలోచనలకు నాంది పలికింపజేస్తోందని పెద్దలు చెప్పిన మాట అక్షరాల మూట. ప్రస్తుతం కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇలా జనజీవనాన్ని ఇళ్లకు మాత్రమే పరిమితం చేసిన దేశాల్లో భారత్ కూడా ఒక్కటి. అయితే భారత్ దేశం వ్యవసాయ అధారిత దేశం కావడంతో పాటు రెక్కాడితే కాని డొక్కాడని ప్రజలు కూడా అధిక సంఖ్యలో వున్న దేశంమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూట గడవాలంటే కూడా కొట్లాది కుటుంబాలు అలోచనలో పడ్డాయి. ప్రాణాలుంటూ కొన్ని రోజుల తరువాత పరిస్థితులు మారుతాయన్న పాలకుల మాటలకు ప్రాధాన్యమిస్తున్నారు.
అయితే ఓ ఆటో డ్రైవర్ మాత్రం తన మూడు చక్రాల అటోబండి నడవకపోతే.. తన బతుకు బండి నడవదని.. తీవ్రంగా అలోచించాడు. తన సెవన్ సీటర్ ఆటోను బయటకు తీసి లాక్ డౌన్ వేళ తన బండి నడుపుకునేందుకు ప్రయత్నించాడు. అయితే సామాజిక దూరం పాటించాలని.. లేని పక్షంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆటోలో ప్యాసెంజర్లను ఎలా ఎక్కించుకుని నడుపుతారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి, దీంతో తన సెవన్ సీటర్ అటోను నాలుగు చాంభర్ సీటర్ గా మార్చాడు. ఇక సవారీకి సై అన్నాడు. తన ఆటోను ఎలా మార్చాడో మీరూ ఓ లుక్కేయండీ..
ఈ ఆటో రిక్షా డ్రైవర్ తన ఆటోలో ఎక్కేవారి క్షేమం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన ఆటో లోపలి భాగాన్ని అనేక భాగాలు విభజించి, ఒక భాగానికి మరో భాగానికి మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేశాడు. మొత్తమ్మీద నలుగురు వ్యక్తులు భౌతిక దూరం పాటిస్తూ ఆటోలో ప్రయాణించేలా తన ఆటోను తీర్చిదిద్దాడు. దీనికి సంబంధించిన వీడియో చూసిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ముగ్దుడయ్యాడు. మన ప్రజల తెలివితేటలు, ఆవిష్కరణ శక్తులు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయని ట్వీట్ చేశారు. తన అభిప్రాయం ఏంటంటే, ఈ ఆటో రిక్షా డ్రైవర్ ను మన ఆర్ అండ్ డి మరియు ప్రొడక్ట్ డెవలప్ మెంట్ టీమ్ లకు సలహాదారుగా నియమించాలి అని అభిప్రాయపడ్డారు.
The capabilities of our people to rapidly innovate & adapt to new circumstances never ceases to amaze me. @rajesh664 we need to get him as an advisor to our R&D & product development teams! pic.twitter.com/ssFZUyvMr9
— anand mahindra (@anandmahindra) April 24, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more