భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్తోపాటు పలు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత్ కోవిడ్ బాధితుల సంఖ్య 13 వేల 835కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 1076 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మరోసారి ఒకే రోజు వెయ్యికి మించి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతున్నా.. మరోవైపు కేసులు అంతకంతకూ పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది.
రాష్ట్రాల పరంగా చూసినప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్లో ఇప్పటి వరకు వెయ్యి కేసులు దాటాయి. గుజరాత్లో శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 1021కు చేరింది. 38 మంది చనిపోయారు. ఇక దేశంలో కరోనా మహమ్మారి 452 మందిని ఇప్పటి వరకు బలితీసుకుంది. గురువారం 28 మంది చనిపోగా.. శుక్రవారం ఏకంగా 32మంది ప్రాణాలు విడిచారు. ఇక కరోనా బారినపడి 1766 మంది కోలుకున్నారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 11 వేల 616కు చేరింది. లాక్డౌన్కు ముందు దేశంలో కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి కేవలం మూడు రోజులే పట్టింది.
లాక్డౌన్ కాలంలో గత ఏడు రోజులు కేసుల వివరాలను పరిశీలిస్తే... కేసుల రెట్టింపుకు 6.2 రోజులు పడుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల రెట్టింపు సరాసరి జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్తోపాటు.. కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు, హరియాణా, ఢిల్లీ, బీహార్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా కారణంగా కోలుకుంటున్న వారి సంఖ్య, మరణిస్తున్న వారి నిష్పత్తి 80: 20గా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. కొన్ని దేశాలతో పోల్చినప్పుడు భారత్ మెరుగైన స్థానంలో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా కరోనా కోసం కేటాయించిన 1919 ఆస్పత్రుల్లో... లక్షా 73వేల ఐసోలేషన్ బెడ్లు, 21వేల 800 ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 3 లక్షల 19వేల 400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని... గురువారం ఒక్కరోజే 28వేల, 340 టెస్ట్లు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. లాక్డౌన్ ముందున్న పరిస్థితులతో పోల్చినప్పుడు కరోనా కొత్త కేసుల నమోదు ఇప్పుడు 40శాతం తగ్గినట్టుగా కేంద్రం తెలిపింది. మార్చి 15 నుంచి 30 వరకు పోల్చితే... 2.1 శాతం కేసులు నమోదయ్యాయన్నారు. ఏప్రిల్ 1 నుంచి శుక్రవారం రాత్రి వరకు 1.2శాతం కేసులే నమోదయ్యాయని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more