యావత్ ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుంది. చైనాలో కాసింత శాంతించి.. అదుపులోకి వస్తున్న కరోనా బాధితుల సంఖ్య ఇక ప్రపంచంలోని ఇతర ప్రాంతంలో అందోళన చెందెలా కరోనా బాధితుల సంఖ్య పెరగుతొంది. ఈ తరుణంలో ఇటు భారత్ లోనూ కరోనా కేసుల రెండు రోజుల వ్యవధిలోనే పదికేసులు పెరిగాయి. కేరళలోని మూడేళ్ల చిన్నారిని కూడా వదలని కరోనా వైరస్ మహమ్మారి.. అటు ఇటలీ, యూరోప్ దేశాలలోనూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఫలానా చేస్తే కరోనా వ్యాధి సోకదంటూ అనేక కథనాలు అంతర్జాలంలో దర్శనమిస్తున్నాయి.
వాటిల్లో ఒకటి మద్యం. ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందని ఒకటి, ఆల్కహాల్ నుగానీ, క్లోరిన్ ను గానీ శరీరంపై స్ప్రే చేసుకుంటే వైరస్ పోతుందని మరొకటి, వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ సోకదని ఇంకొకటి.. ఇలా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని పక్కనబెడితే తాజాగా ఔషద గుణాలున్న అల్లం, వెలుల్లిలను వేడి నీళ్లలో వేసి కాచిన తరువాత గోరువెచ్చిన నీళ్లతో కూడా వైరస్ తగ్గుతుందని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కోడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.
కరోనా వైరస్ నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని డబ్ల్యూహెచ్ వో, డాక్టర్లు ప్రకటించారు. హ్యాండ్ శానిటైజర్లలో 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. మిగతా పదిశాతం మరికొన్ని రసాయనాలు ఉంటాయి. అంతేకాకుండా ఆల్కహాల్, క్లోరిన్ రెండూ సూక్ష్మజీవులను నాశనం చేస్తాయన్నది ముందు నుంచీ తెలిసిందే. అయితే ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందన్న ప్రచారం సత్యదూరమని అంటున్నారు ప్రపంచ ఆరోగ్యసంస్థ శాస్త్రవేత్తలు. ఆల్కహాల్ తో వైరస్ వంటి సూక్ష్మ జీవులు చనిపోతాయన్నది వాస్తవమే.
అయితే బాధితులు ఆల్కహాల్ తాగితే అది కేవలం రక్తంలో కలిసి, ఫిల్టర్ అవుతుందని, ఏ సూక్ష్మ క్రిమిపైనా ప్రభావం చూపడం ఉండదని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది. ఇక శరీరంపై ఆల్కహాల్, క్లోరిన్ పూసుకోవడం వల్ల చర్మంపై ఉండే వైరస్ చనిపోతుందే..తప్ప అప్పటికే శరీరం లోపలికి చేరిన వైరస్ పై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించింది. ఆల్కహాల్ ఉండే హ్యాండ్ రబ్ లు, హ్యాండి శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని తెలిపింది. ఇక వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ రాదన్న ప్రచారం కూడా అవాస్తవమని చెప్పింది. అయితే వేడి నీళ్లతో గొంతు పుక్కిలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more