హైదరాబాద్ నగరంలోని భరత్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రడ్జిపై ప్రమాదం జరిగి 24 గంటలకు గడచియో లేదో.. మరో కారు ప్రమాదం ఘటన నగరంలోని మియాపూర్ ప్రాంతంలో సంభవించింది. కారు నడుపుతున్న వ్యక్తులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం అదిచాలదన్నట్లు పీకల వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. దీంతో రోడ్డుపై ఎంతో అప్రమత్తంగా వెళ్తున్న సగటు ప్రయాణికుల ప్రాణాలపైకి తీసుకువస్తున్నారు.
తాజాగా మియాపూర్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పీకల వరకు మధ్యం సేవించిన ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. వేగంగా వెళ్తూ అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టాడు. అదే వేగంతో ముందుకు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న పాన్ షాపులోకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును షాపు నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సాయంకాలం మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పెట్టడంతో.. అది కొన్ని ప్రాంతాల్లో రాత్రిళ్ల వరకు కొనసాగుతుండటం కూడా తెలిసిన కొందరు రాత్రితెల్లవార్లూ మద్యం సేవిస్తూ.. తెల్లవారుజామున తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. ఈ సమయాల్లో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా వున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కోంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more