ఆంధ్రప్రద్రేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఆంశంపై సొంత పార్టీ కార్యకర్తల నుంచే అధికార వైసీపీ పార్టీకి నిరసనలు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామన్న ఊహాగానాలతో రగలిపోతున్న అమరావతి రైతన్నలు మండిపడుతున్నారు. మూడు రాజధానులు ప్రతిపాదనను తక్షణం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని.. పూర్తిస్థాయిలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని గత నాలుగు రోజులుగా నిరసనలు చేపడుతూనే వున్నారు. పోలీసులు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నా ఏ మాత్రం వెనక్కు తగ్గని అమరావతి ప్రజలు శాంతియుతంగానే తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో ప్రజలు ఆందోళనల్లో పాల్గోంటున్నారు. ఈ క్రమంలో సచివాలయం వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తుళ్లూరు, మందడం, మంగళగిరిలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమాలపై ఇప్పటికే రాజధాని అమరావతితోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో స్థానిక రైతన్నలు కూడా విభిన్నంగా అలోచిస్తూ.. తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే ఈ వినూత్న నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. వెలగపూడిలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి వైసీపీ నేతలు ఇటీవల తమ పార్టీ రంగులు వేసుకున్నారు.
కాగా, రాజధానిని మూడు భాగాలుగా చేస్తామని.. ప్రకటించిన క్రమంలో స్థానికి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు.. గ్రామ పంచాయతీ కార్యాలయంపైకి తమ సొంత పార్టీ రంగులను తుడిచేస్తూ నలుపు రంగు వేస్తున్నారు. వారికి గ్రామస్థులు మద్దతు పలికారు. అయితే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులను నెట్టుకుని మరీ పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేస్తున్నారు. భూములు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేయొద్దని రైతులు నినాదాలు చేస్తున్నారు.
రోడ్లపై వాహనాలు వెళ్లకుండా టైర్లు అంటించారు. అమరావతికి వెళ్లే ప్రధాన రహదారి పొడుగునా అందోళనకారులు నిరసనలు చేపట్టారు. గ్రామాల వద్ద టైర్లు అంటించి వాహనాల వెళ్లకుండా అడ్డుగా పెట్టగా.. వాటని పోలీసులు నీల్లు పోసి చల్లార్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, మందడం మెయిన్ సెంటర్లో రోడ్డుకు అడ్డంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బుద్ధుడి ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను కట్టారు. అలాగే, రిలే నిరాహార దీక్షలకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు, రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతులు అర్ధనగ్నంగా కూర్చుని నిరసన తెలిపారు. రోడ్డుపైనే వంటావార్పు చేపట్టిన రైతులు.. మూడు రాజధానుల ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని కోరగల్లులోనూ నిరసనలు వెల్లువెత్తాయి. స్థానికులు తమ పిల్లాపాపలతో కలిసి రోడ్డుపైకి చేరుకుని బైఠాయించారు. నీరుకొండ కొండవీటి వాగు వద్ద రైతులు ఆందోళనకు దిగడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more