తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త బస్సు చార్జీలు ఇవాళ్లి నుంచి అమల్లోకి రావడంతో దీనిపై తెలంగాణ ప్రయాణికుల నుంచి కొంత విముఖత వ్యక్తం అవుతోంది. కిలోమీటరుకు 20 పైసల మేరకు చార్జీలు పెరుగడంతో పాటు కనీస చార్జీలను కూడా పెంచడంతో దాని ప్రభావం ప్రయాణికులపై అధిక ప్రభావాన్నే చూపుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలు వెళ్లే బస్సులో మాత్రం ఈ తేడా కొట్టోచ్చినట్టు కనబడుతుంది. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరే బస్సుల్లో టీఎస్ఆర్టీసీ బస్సులను ఎక్కేందుకు ప్రయాణికులు విముఖత చూపించారు.
ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కర్నూలు, ముంబై, షిరిడీ, తిరుపతి ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా నమోదు అవుతుంది. అయితే ఇదే సమయంలో అవే ప్రాంతాలకు వెళ్లే ఇరత రాష్ట్ర బస్సు సర్వీసులు మాత్రం ప్రయాణికులో కిటకటలాడుతున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కళకళలాడటానికి, తెలంగాణ బస్సులు వెలవెలబోవడానికి కారణం లేకపోలేదు. హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సు చార్జీల్లో కొట్టోచ్చినట్టు కనబడుతున్న వత్యాతమే కారణం. చార్జీల పెంపు నేపథ్యంలో తెలంగాణ బస్సులకు స్పందన కరవైంది.
ఇక కొన్ని ప్రధాన రూట్లలో చార్జీలను పరిశీలిస్తే,
హైదరాబాద్ నుంచి విజయవాడకు
ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ
లగ్జరీ బస్సులో రూ. 317 లగ్జరీ బస్సులో రూ. 355
గరుడలో రూ. 467 రాజధానిలో రూ. 438
అమరావతిలో రూ. 544 గరుడలో రూ. 535
వెన్నెలలో రూ. 724
హైదరాబాద్ నుంచి కర్నూలుకు
ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ
లగ్జరీ బస్సులో రూ. 246 లగ్జరీ బస్సులో రూ. 288
అల్ట్రా డీలక్స్ లో రూ. 234 గరుడా ప్లస్ లో రూ. 429
ఇంద్రలో రూ. 310
హైదరాబాద్ నుంచి తిరుపతికి
ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ
లగ్జరీ బస్సులో రూ. 652 లగ్జరీ బస్సులో రూ. 694 (కడప మీదుగా)
అమరావతిలో రూ. 1,119 లగ్జరీ బస్సులో రూ. 748 (మాచర్ల, ఒంగోలు మీదుగా)
వెన్నెలలో రూ. 1,291 రాజధానిలో రూ. 892
గరుడలో రూ. 1,104
కాగా, తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, బాసర వంటి ప్రాంతాలకు తిరిగే ఏపీ బస్సుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. దీంతో తెలంగాణలోని ప్రాంతాలకు వెళ్లే వారు మాత్రమే టీఎస్ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారంతా ఏపీ బస్సుల కోసం వెతుక్కుంటున్నారు. ఆన్ లైన్ రిజర్వేషన్ లోనూ ఇదే పరిస్థితి. సమ్మె మొదలైన తరువాత ఆగిపోయిన తెలంగాణ ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ వెబ్ సైట్ ఇవాళ ప్రారంభం అయింది. టికెట్ల బుకింగ్ ముఖ్యంగా ఏపీకి వెళ్లే బస్సుల్లో రిజర్వేషన్లు మందకొడిగా కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more