విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు ఇవాళ శ్రీ సరస్వతీ దేవి దేవి అవతారం భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శరన్నవరాత్రి వేడుకలలో తొమ్మిది రోజులు తోమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చే దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. నవరాత్రి వేడుకలలో వివిధ అవతరాల్లోని కొలువయ్యే దుర్గమ్మ దర్శంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు నలుమూలల నుంచి ఇంద్రకీలాద్రికి చేరకుంటున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అక్టోబర్ 5, శనివారం నాడు అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని ఇవాళ తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం నుంచి పిల్లలకు విద్యాబుద్దులు ఉన్నత చదువులు సక్రమంగా సాగాలని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. చేతిలో కచ్ఛపి అనే బంగారు వీణను ధరించి, నెమలి వాహనాన్ని అధిరోహించి ఉంటుంది. ఈమెను విజ్ఞానదేవతగా శాస్త్రాలు చెబుతున్నాయి.
సరస్వతీ దేవి బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. సంగీతం, నృత్యం వంటి కళలూ ఈ తల్లి అనుగ్రహం వల్లే లభిస్తాయి. వ్యాసుడు, యాజ్ఞవల్క్యుడు, వాల్మీకి తదితర మహర్షులందరూ ఈ తల్లిని పూజించి మహోన్నతమైన కావ్యాలు, పురాణాలు రచించారు. కళాకారులుగా ప్రముఖులుగా వెలుగోందుతున్న వారికి సరస్వతీ కటాక్షం వుందనే అంటారు. అక్షరజ్ఞానంతో పాటు అవసరమైన సంస్కార జ్ఞానాన్నీ అందిస్తుంది మాతృమూర్తిగా ఉన్న మహిళ. అందుకనే అన్ని విద్యలకు మహిళ అయిన సరస్వతిని అధిష్ఠాన దేవతగా మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
శ్రీ సరస్వతి దేవి అవతారంలోని అమ్మవారిని దర్శించుకోటానికి భక్తులు వేకువజాము నుండే ఇంద్రకీలాద్రికి బారులుతీరారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఐదవ రోజున లలితా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచ్చేశారు. అమ్మవారి ఆలయ అర్చకులు ఆయనను పూర్ణకుంభంతో ఆలయ లాంఛనాలతో ఘనంగా అహ్వానం పలికారు. ఇక ఇవాళ కూడా అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more