ఓ మహిళతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నించిన వ్యక్తికి రాజస్థాన్ హైకోర్టు షాకిచ్చింది. భారతీయ సమాజంలో సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టుగానే పరిగణించాలని అభిప్రాయపడింది. అంతే తప్ప మరోలా భావించడంలో అర్థం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో యువతితో నిందితుడు పెళ్లి చేసుకోవడానికి అనుమతిని ఇవ్వలేదు. దీంతో బాధితురాలి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ మేరకు న్యాయస్థానం నిందితుడు బలరామ్ తో పాటు.. ఆతను వివాహం చేసుకుందామనుకున్న యువతికి కూడా నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు రాజస్థాన్ హోం శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ, ఝున్ ఝును జిల్లా కలెక్టర్ కూడా కూడా తాఖీదులను పంపింది. బాధితురాలై ఓ వివాహిత పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఓ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలరాంకు స్నేహం కుదిరింది.
వారి పరిచయం పరిణయానికి దారి తీసింది. అయితే తాను వివాహితను అన్న విషయాన్ని మర్చిపోయిన అమె.. బలరాం తనకు ఇచ్చిన హామీ మేరకు వివాహమాడుతాడని విశ్వసించింది. అంతే తన సర్వస్వాన్ని అందించింది. అంతేకాదు పెళ్లాడతానని బలరాం మాటివ్వడంతో తన భర్తకు విడాకులు కూడా ఇచ్చేసింది. ఇక తన పూర్తి జీవితం బలరామే అని నమ్మింది. అయితే, ఇటీవల బలరాంకు ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో అతని హోదాలో, జీతం, జీవితంలో కొత్తదనం వచ్చి చేరింది.
అన్ని కొత్తగా సమకూరుతున్న సమయంలో పాత వివాహిత ఎందుకు అనుకున్నాడో ఏమో.. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాల్సిన అవసరమేంటి అని కూడా భావించాడు. అమెతో దూరంగా జరిగాడు. అమె ఫోన్ కు కూడా బదులివ్వడం మానేశాడు. ఎదో తెడా వస్తుందని భావించిన భాదితురాలు.. కూపీ లాగడంతో బలరాం మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడన్న విషయం తెలిసింది. దీంతో అమె పోలీసులను ఆశ్రయించింది. సదర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 6 నమోదైన కేసు విచారణకు రావడంతో హైకోర్టు.. సహజీవనం చేయడమంటే పెళ్లాడినట్టేనని సంచలన తీర్పు వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more