సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 92 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు తన పోరపాటును గ్రహించి.. తన చేతి వేలును నరుకున్నాడు. ఓ పార్టీకి ఓటువేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఓ వ్యక్తి పొరపాటున మరో గుర్తుపై వేశాడు. దీంతో జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందిన ఆ వ్యక్తి తన వేలినే నరుక్కున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బులందషహర్ చోటుచేసుకుంది. బులంద్షహర్ నియోజకవర్గంలో ఎస్పీ-బీఎస్సీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటేద్దామని వెళ్లిన యువకుడు పోరపాటున బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ బోలా సింగ్ కు ఓటు వేసిన ఈ ఘటనకు పాల్పడ్డాడు.
బులంద్ షహర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అబ్దుల్లాపూర్ హులసన్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (25) అనే యువకుడు బీఎస్పీ పార్టీ అభిమాని. దీంతో తమ పార్టీ తరపున ఈ సారి ఎన్నికల బరిలో నిలిచిన యోగేశ్ వర్మకు ఓటు వేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తరువాత.. ఈవీఎం దగ్గరికి వెళ్లాక పొరపాటున ఈవీఎంపై బీజేపీ గుర్తు మీటను నొక్కాడు. తీవ్ర అసహనానికి గురైన పవన్ కుమార్ ఆవేశంలో తాను ఓటు వేసిన వేలుని నరికేసుకున్నాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగానే వేలును నరికేసుకున్నానని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరోవైపు, పోలింగ్ జరుగుతుండగా తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతున్న సిట్టింగ్ ఎంపీ బోలా సింగ్ వీడియో కూడా వైరల్ అవుతోంది. నేరుగా ఓట్లేయని అడగకపోయినా, ఓటర్ల ఆశీర్వాదం కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్టు వీడియోలో స్పష్టమవుతోంది. దీనిపై విపక్షం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో బోలా సింగ్కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో సాధించిన స్థానాలను నిలబెట్టుకోవాలని కమలనాథులు, తమ పట్టు నిలుపుకోవాలని ఎస్పీ-బీఎస్పీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమ వైరాన్ని పక్కనబెట్టి అఖిలేశ్- మాయలు చేతులు కలిపారు. కూటమిగా ఏర్పడి బీజేపీకి కంటిమీద కునుకలేకుండా చేస్తున్నారు.
#Watch: Shocker coming in from Bulandshahr, as a BSP supporter chopped off his finger after he allegedly pressed the wrong button on the EVM and voted for BJP instead. #LokSabhaElections2019 pic.twitter.com/1YqYIr2QWq
— Mohit Sharma (@iMohit_Sharma) April 18, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more