ఎరిక్సన్ కంపెనీకి బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్ కామ్ చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఈ రోజు వరకు వడ్డీతో కలిపి ఆర్ కామ్ ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని, అనిల్ అంబానీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఎరికన్స్ తరపు అడ్వకేట్ అనిల్ ఖేర్ తెలిపారు. ఇంతకుముందే రూ.118 కోట్లను ఆర్ కామ్ సుప్రీంకోర్టులో డిపాజిట్ చేసింది. దీంతో ఎరిక్సన్ కి బాకీ ఉన్న మొత్తం రూ.580కోట్లను ఆర్ కామ్ చెల్లించినట్లయింది. బీఎస్ఈలో ఆర్ కామ్ షేర్లు 9.3 శాతం పడిపోయి రూ.4 దగ్గర కొనసాగుతోంది.
తమకు చెల్లించాల్సిన బకాయిలను ఆర్ కామ్ చెల్లించలేదంటూ 2018లో ఎరిక్సన్ కోర్టుని ఆశ్రయించింది. దీంతో అక్టోబర్-23,2018న సుప్రీంకోర్టు ఎరిక్సన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. డిసెంబర్-15,2018లోగా ఎరికన్స్ కు బకాయిలు చెల్లించాలని ఆర్ కామ్ ను కోర్టు ఆదేశించింది. ఆలస్యం చేస్తే 12శాతం వార్షిక వడ్డీతో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీని కోర్టు ధిక్కరణ కింద జైలుకి పంపాలని,విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ మరోసారి సుప్రీంని ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి-20,2018న అనీల్ అంబానీని దోషిగా తేల్చింది. నాలుగువారాల్లోగా ఎరిక్సన్ కు రూ.453 కోట్లు బాకీ చెల్లించకుంటే మూడు నెలల జైలు శిక్ష తప్పదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధించిన నాలుగువారాల గడువు అయితే చివరి క్షణంలో రంగంలోకి దిగిన అనీల్ అంబానీ సోదరుడు ముఖేష్ అంబానీ తన తమ్ముడిని జైలు పాలు కాకుండా కాపాడగలిగారు. ఎరిక్సన్ కు ఇవాళ బాకీ డబ్బులు చెల్లించడంతో జైలుకెళ్లే పరిస్థితి నుంచి అంబానీ బయటపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more