ఎరిక్సన్ కంపెనీకి బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్ కామ్ చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఈ రోజు వరకు వడ్డీతో కలిపి ఆర్ కామ్ ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని, అనిల్ అంబానీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఎరికన్స్ తరపు అడ్వకేట్ అనిల్ ఖేర్ తెలిపారు. ఇంతకుముందే రూ.118 కోట్లను ఆర్ కామ్ సుప్రీంకోర్టులో డిపాజిట్ చేసింది. దీంతో ఎరిక్సన్ కి బాకీ ఉన్న మొత్తం రూ.580కోట్లను ఆర్ కామ్ చెల్లించినట్లయింది. బీఎస్ఈలో ఆర్ కామ్ షేర్లు 9.3 శాతం పడిపోయి రూ.4 దగ్గర కొనసాగుతోంది.
తమకు చెల్లించాల్సిన బకాయిలను ఆర్ కామ్ చెల్లించలేదంటూ 2018లో ఎరిక్సన్ కోర్టుని ఆశ్రయించింది. దీంతో అక్టోబర్-23,2018న సుప్రీంకోర్టు ఎరిక్సన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. డిసెంబర్-15,2018లోగా ఎరికన్స్ కు బకాయిలు చెల్లించాలని ఆర్ కామ్ ను కోర్టు ఆదేశించింది. ఆలస్యం చేస్తే 12శాతం వార్షిక వడ్డీతో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీని కోర్టు ధిక్కరణ కింద జైలుకి పంపాలని,విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ మరోసారి సుప్రీంని ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి-20,2018న అనీల్ అంబానీని దోషిగా తేల్చింది. నాలుగువారాల్లోగా ఎరిక్సన్ కు రూ.453 కోట్లు బాకీ చెల్లించకుంటే మూడు నెలల జైలు శిక్ష తప్పదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధించిన నాలుగువారాల గడువు అయితే చివరి క్షణంలో రంగంలోకి దిగిన అనీల్ అంబానీ సోదరుడు ముఖేష్ అంబానీ తన తమ్ముడిని జైలు పాలు కాకుండా కాపాడగలిగారు. ఎరిక్సన్ కు ఇవాళ బాకీ డబ్బులు చెల్లించడంతో జైలుకెళ్లే పరిస్థితి నుంచి అంబానీ బయటపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more