తమది ఉగ్రవాద దేశం కాదు అని పాకిస్థాన్ ప్రపంచదేశాలకు చాటిచెప్పాంటే ముందుగా ఆ దేశంలో వున్న ఉగ్రవాద సంస్థలపై తీసుకునే చర్యలు కొత్తగా ఉండాలని పాకిస్తాన్ కు భారత్ సూచించింది. ఈ విషయంలో పాకిస్థాన్ కొత్తగా అలోచిస్తే తప్ప పాకిస్థాన్ పై వున్న ముద్ర చెరిగిపోదని పేర్కోంది. ఈ విషయమై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ సరిహద్దుల్లో ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే భాగంలోనే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపై వైమానిక దాడులు చేశామని చెప్పారు.
దేశ రక్షణ కోసం ఇలాంటి దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పిన ఆయన పాకిస్థాన్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే విధానంలో కొత్తగా అలోచించాలని స్పష్టం చేశారు. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడిని నాన్-మిలటరీ చర్యగా ఆయన అభివర్ణించారు. భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మిగ్- 21తో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూల్చివేశారని, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలూ మన దగ్గర ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలను సంఘటనా స్థలం నుంచి సేకరించామని, ఎఫ్-16 యుద్ధ విమానంలో మాత్రమే వినియోగించగలిగే అమ్రామ్ క్షిపణులను లభించడమే దీనికి సాక్ష్యమని అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించామని రవీష్ కుమార్ వెల్లడించారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ జరిపిన దాడులను అడ్డుకునే క్రమంలో ఓ యుద్ధ విమానాన్ని కోల్పోయామని తెలిపారు. భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలను తాము కూల్చేశామని పాక్ చెబుతోంది. కానీ, దీనికి ఆధారాలను ఎందుకు చూపలేదని ఆయన ప్రశ్నించారు.
పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత అంతర్జాతీయ సమాజం మొత్తం భారత్ కు మద్దతుగా నిలిచిందని తెలియజేశారు. ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ప్రకటించినా పాకిస్థాన్ దీన్ని ఖండించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పాక్ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగిస్తున్నాయని, ఈ విషయంలో పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకుని తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని సూచించారు.
ఇప్పటికీ పాకిస్థాన్ లో 22 ఉగ్రవాద శిక్షణా శిభిరాలు నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని.. వీటిలో మసూద్ అజార్ కు చెందిన జైషూ మహ్మద్ సంస్థకు చెందిన శిభిరాలు 9 వున్నాయిని కూడా తేలిందన్నారు. వీటిపై పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన పాకిస్థాన్, తమ దేశంలోని ఉగ్రవాద సంస్థలపై అంతర్జాతీయ సమాజం నమ్మదగిన చర్యలు తీసుకోవాలని రవీష్ కుమార్ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more