సంక్రాంతి పండుగ పర్వదినం సందర్బంగా ప్రైవేటు పౌర విమానయాన సంస్థలు ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఏయిర్ ఏషియా, జెట్ ఎయిర్ వేస్ సంస్థలు ప్రయాణికులను అకర్షించడానికి.. దేశీయ, విదేశీ ప్రయాణాలను అత్యంత చౌకధరల్లో ప్రయాణించే ఆఫర్ ప్రకటించాయి. ఈ క్రమంలో తానేం తక్కువ అంటూ ఇండిగో ఎయిర్ వేస్ కూడా సామాన్య మధ్యతరగతి తొలిసారిగా విమానయానం చేసే ప్రయాణికుల కోసం అత్యుత్తమ ఆఫర్ ను ప్రకటించింది.
ఎయిర్ ఏసియా, జెట్ ఎయిర్ వేస్ విమాన ప్రయాణికులకు దేశంలోని పలు రూట్లలో రూ. 999కే టికెట్ అందిస్తున్నట్లు తెలిపింది. జనవరి -21 నుంచి 31 వరకు ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని.. ఇందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ జనవరి-7 నుంచి 20 వరకు ఉంటాయని తెలిపింది ఏయిర్ ఏషియా ఇండియా. ఈ డిస్కౌంట్ దేశంలోని 20 రూట్స్ లో ప్రయాణించేవారికి కల్పించింది.
ఇంటర్నేషనల్ రూట్స్ లో రూ.2,999కే ప్రారంభ టికెట్స్ అందుబాటులో ఉండగా.. సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రాబి, బాలి ప్రాంతాలకు ఈ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే మరో విమానయాన సంస్థ ఇండోగో కూడా రూ.999కే టికెట్ ధరను ప్రకటించింది. ఇక ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ఇవాళ తాజాగా ప్రకటించిన ఆఫర్ ప్రకారం కేవలం 899 రూపాయాలకు దేశీయ టికెట్లను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలను మాత్రం రూ.3,999కి అందుబాటులోకి తీసుకువచ్చింది.,
ఈ ఆఫర్ కింది ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి జనవరి 13 వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. కాగా ఈ అపర్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ నెల 24 నుంచి ఏప్రీల్ 15 మధ్యకాలంతో తమ ప్రయాణాలను సాగించాల్సి వుంటుంది. తమ సంస్థకు చెందిన అన్ని మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆపర్ ను కల్పించిన సంస్థ.. ఇక మెబివిక్ వాటెంట్ ద్వారా అన్ లైన్ పేమెంట్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇండిగో ఎయిర్ లైన్స్ రూ. 500 క్యాష్ బ్యాక్ అఫర్ ను కూడా అదనంగా అందించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more