ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా చలిగాలులు వీస్తూ.. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. బయటకు రావాలంటే కూడా జనం జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరుకున్నాయి. లంబసింగిలో సున్నా డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 1.5 డిగ్రీలు, మినుములూరులో 3, పాడేరులో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
2010లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవగా... ఇప్పుడు మళ్లీ చలి పులి పంజా విసిరింది. వణికిస్తున్న చలిలో మన్నెం ప్రాంతంలోని పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విపరీతమైన పొగమంచు కారణంగా సూర్యుడు ఉదయం 11 గంటల తర్వాతే దర్శనమిస్తున్నాడు. ఇటు తెలంగాణలో కూడా చలి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లోని బేగంపేటలో గత శుక్రవారం రాత్రి పూట 9.9 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు కాగా, బీహెచ్ఈఎల్ లో అదే రోజున 6.6 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది.
శీతల పొడిగాలులతో నగరవాసులు రాత్రివేళల్లో వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున కనిష్ఠంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువ. పగటిపూట సాధారణ కంటే ఒక డిగ్రీ తక్కువగా 27.2 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తా, ఒడిశాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్లే నగరంలో చలి తీవ్రత అధికంగా ఉందని తెలిపారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు వెళ్లాలని చెబుతున్న వైద్యాధికారులు.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పని సరిగా స్వెటర్లు, జాకెట్లు వాడాలనీ, చిన్న పిల్లలు, ముసలివాళ్లు తప్పని సరిగా ఉన్ని వస్త్రాలు వేసుకోవాలని తెలిపారు. ఆస్తమా రోగులు, చిన్న పిల్లలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని హెచ్చరిస్తున్నారు. చలి గాలుల వల్ల స్వైన్ఫ్లూ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వ్యాధి భారిన పడకుండా జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more