తెలంగాణలో ఓటరు తీర్పు ఎలా వుంటుందన్న ఉత్కంట ఇవాళ ఉదయం వరకు అన్ని పార్టీల నేతలను, అభ్యర్థులను కలవరపెట్టాయి. కాగా, ఇవాళ ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో అది నుంచి ఫలితాలు మాత్రం ఏకపక్షంగా అధికార టీఆర్ఎస్ పక్షాన సాగాయి. దీంతో మంత్రి కేటీఆర్ తన ట్విటర్ పేజీలో కొత్త ప్రొఫైల్ ఫొటోను పెట్టారు. తుపాకీ పట్టుకుని గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోకు ఇప్పటికే 16 వేల లైక్లు, వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చాయి.
‘కేటీఆర్..గురిచూసి కొడుతున్నారు..విజయం ఆయనదే..’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్లు పెడుతున్నారు. కేటీఆర్ పోస్ట్ చేసిన ఈ కొత్త ఫొటోపై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. ‘ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్.. ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. శుభాకాంక్షలు’ అని వెంకట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోపై డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా కామెంట్ చేశారు. ‘ఈ ఫొటో కాన్ఫిడెన్స్ కు కొత్త అర్థం చెబుతోంది. ఫలితాల క్రమంలో కేటీఆర్ కొత్త ఫొటోను పెట్టారు’ అని ట్వీట్ చేశారు.
ఇదిలా వుండగా, ఎన్నికల నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు హద్దుమీరి మరీ చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారని మీడియా ప్రశ్నపై నిజామాబాద్ ఎంపీ కవిత చాలా హుందాగా స్పందించారు. ప్రజా కూటమి ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నామని పేర్కోన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇక వారి ప్రగల్బాలపై విజ్ఞతను వారికే వదిలివేస్తున్నామని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పుకే ఎక్కవు విలువ వుంటుందని, వారే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేతలను శిక్షించారని.. అంతటి భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నవారిని తాము క్షమించి వదిలేస్తామని చెప్పారు. అయితే ప్రజాబీష్టం వెలువడిన తరువాత ఏం చేసుకున్నా వారి ఇష్టమని.. ఇక గడ్డాలు పెంచుకుంటారా.. సన్యాసం తీసుకుంటారా అన్నది వారిష్టానికే వదిలేస్తున్నామని చెప్పారు. ఇకనైనా వారి మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే, తదుపరి ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలను సాధించుకోవచ్చని సలహా ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more