తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఈ ఎన్నికలలో మీరు ఓటు వేయాలంటే.. ఓటరు జాబితాలో మీ పేరు వుందా.? లేదా.? అన్నది మరోసారి చెక్ చేసుకోవాలని తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ మరోమారు తెలంగాణ ప్రజలను కోరారు. ఇవాళ్టితో ఓటు నమోదు కార్యక్రమం ముగుస్తున్న క్రమంలో ఓటరుగా నమోదు చేసుకోని వారు.. అడ్రస్ మార్చిన వారు తమ ఓట్లను జాబితాలో చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
ఓటరు జాబితాలో మీ పేరు లేని పక్షంలో తక్షణం ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికీ ఓటు పొందనివారు, జనవరి 1, 2018కి 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకూ ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఫొటో, వయసు ధ్రువీకరణ, చిరునామా తెలిపే గుర్తింపు కార్డులతో మండల కేంద్రాలు, పంచాయితీలు, కలెక్టరేట్ సహాయ కేంద్రాలు, బీఎల్వో వద్ద ఓటు నమోదు చేసుకునేందు అవకాశం కల్పించారు.
ఇప్పటికీ ఓటర్లుగా నమోదు చేయించుకోనివారు త్వరగా నమోదు చేసుకోవాలని, ఇంటి నెంబర్లలో మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని కోరారు ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. కొత్త సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లు తొలిగిస్తున్నట్టు చెప్పారు. 52,100 ఈవీఎంలు, 32,590 వివి ప్యాట్ యంత్రాలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఈవీఎంలు అన్నీ బాగానే పనిచేస్తున్నా.. వీవీ ప్యాట్ యంత్రాల్లో 7,8 శాతం పని చెయ్యడం లేదన్నారు. సెప్టెంబర్ 25తో ఓటు నమోదు గడువు మూగిసినా.. పేర్ల సవరణ, చిరునామా మార్పు, తదితర ఇతర సవరణలకు ఈసీ గడువును ఈ నెల 9 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
ఓటు నమోదు, సవరణల ఫారాలు ఇవే..
* ఫారం 6 - ఇప్పటి వరకూ ఓటు నమోదు చేసుకోని కొత్త ఓటర్లు ఈ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.
* ఫారం 7- ఓటరు కార్డు తొలగింపు కోసం ఈ ఫారం వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా చనిపోయినా, వేరే నియోజకవర్గానికి మారినా.. వేరే చోటికి బదిలీ అయినా ఈ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more