మరో నెల రోజుల లోపు వ్యవధిలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు తన జోరును కొనసాగించాలంటే ఆ ఒక్కస్థానాన్ని మాత్రం మర్చిపోవాలని.. లేదంటే కారు జోరుకు తాము బ్రేకులు వేస్తామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అధికార టీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఆ ఒక్క సీటు తప్ప ఇంకెక్కడైనా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసుకోవచ్చని అసదుద్దీన్ ఒవైసీ అధికార టీఆర్ఎస్ కు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఆ ఒక్క సీటే రాజేంద్రనగర్.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చనీ, కానీ రాజేంద్ర నగర్ లో మాత్రం అడుగుపెట్టొద్దని పరోక్షంగా హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా ప్రజలను పట్టించుకోని కొందరు నేతలు ఎన్నికల నేపథ్యంలో కారులో దూసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కారు’ ప్రయాణాన్ని సుఖవంతం చేయాలనుకుంటే రాజేంద్రనగర్ ను తమకు ఇవ్వక తప్పదని స్పష్టం చేశారు. ఇక్కడ ‘కారు’ నడవబోదనీ, దాని స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో చంద్రబాబు కూటములు ప్రభావం అంతగా పనిచేయబోవని జోస్యం చెబుతూ అధికార పార్టీకి వంతపాడిన ఆయన.. ఎంఐఎం ను హైదరాబాద్ నుంచి తరిమివేస్తామన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీజేపీ ముక్త తెలంగాణ త్వరలోనే సాకారమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో ఎంఐఎం కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఎంఐఎం పార్టీతో తమకు మైత్రి కోనసాగుతుందని చెబుతున్న టీఆర్ఎస్ పార్టీ.. వారితో పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ మాత్రం కోనసాగుతుందని చెప్పారు.
కాగా, స్నేహపూర్వక పోటీ నేపథ్యంలో ఈ రెండు మిత్రపక్ష పార్టీల మధ్య తాజాగా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్తానం మాత్రం అగ్గి రాజేస్తుంది. ఈ సీటుపై అశలు వదులుకుంటేనే టీఆర్ఎస్ పార్టీకి మంచి జరుగుతుందని, లేదంటే తమ పార్టీ రానున్న ఎన్నికలలో అధికార పార్టీ జోరును అడ్డుకుంటామని కూడా తేల్చిచెబుతుంది. మరీ ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.? ఎంఐఎంతో ఎలాంటి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more