పీకల వరకు మధ్యం సేవింది ఒళ్లుపై తెలియక తమ వాహనాల్లో రోడ్లపైకి వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే మద్యంబాబులు హైదరాబాద్ లో రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వీరి అటలు కట్టించడానికి పోలీసులు అర్థరాత్రిళ్లు కూడా విధులు నిర్వహిస్తూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడుతున్నా.. మందుబాబుల్లో కాసింత కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్న భావన మాత్రం రావడం లేదు. ఇక పోలీసులు తనిఖీలు చేపడుతుండటంతో వారిని తప్పించుకుని వెళ్లేందుకు మార్గాలను అన్వేషిస్తూ అనవసర ప్రమాదాలకు గురవుతున్నారు.
అయితే గత ఏడాదికి పూర్వం వున్నట్లుగా రాత్రి పదిగంటల వరకే మద్యం దుకాణాలు అమ్మకాలు సాగించేందుకు బదులు ఈ ఏడాది ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుతో అర్థరాత్రిళ్ల వరకు బార్లు బార్ల తెరిచి మధ్యం అమ్మకాలు సాగిస్తుండటంతో.. ముందుబాబుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తి చేసిన హంగామా తక్కువ కాదు. తానెవరో తెలుసా? అంటూ భయపెట్టాడు.
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్నేహితుడినని, తనతో పెట్టుకోవద్దని బెదిరించాడు. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లకు ఇంగ్లిష్ రాదంటూ ఎద్దేవా చేశాడు. శనివారం రాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ కు చెందిన నితీశ్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఆల్కహాల్ టెస్టు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా హల్చల్ చేశాడు. పోలీసులను బెదరగొట్టాడు.
తన ఫోన్ తీసి ఎంపీ కవిత ఫొటోను చూపిస్తూ.. ఆమె తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ హంగామా చేశాడు. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లకు గవర్నమెంట్, సైకాలజీ వంటి చిన్న ఇంగ్లిష్ పదాలకు కూడా స్పెల్లింగ్ తెలియదని ఎద్దేవా చేశాడు. చివరికి అతి కష్టం మీద అతడికి ఆల్కహాల్ టెస్టు నిర్వహించగా మద్యం తాగినట్టు తేలింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more