జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. గత వారమే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరగా, విజయవాడకు చెందిన మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని ప్రకటించారు. ఇక తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి కూడా పవన్కు జైకొట్టారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ను కలిసి.. పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చదలవాడకు పార్టీ కండువా కప్పి.. సాదరంగా ఆహ్వానించారు జనసేనాని. కృష్ణమూర్తితో పాటూ మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరారు.
జనసేన విధానాలు, పవన్ సేవా దృక్పథాలు నచ్చి పార్టీలో చేరానన్నారు చదలవాడ. పార్టీలో చేరడం సంతోషంగా ఉందని.. తిరుపతి, చిత్తూరుజిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కృష్ణమూర్తి జనసేనలో చేరడం శుభపరిణామమన్నారు పవన్. సీనియర్ నేతలు పార్టీకి ఎంతో ముఖ్యమని.. మొదటి నుంచి తమ కుటుంబానికి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.
చదలవాడ కృష్ణమూర్తి రాజకీయాల్లో సీనియర్ నేతగా ఎదిగారు. 1973లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 1981లో నాయుడుపేట సర్పంచ్గా గెలిచారు. 1994లో తిరుపతి టిక్కెట్ ఆశిస్తే.. కాంగ్రెస్ శ్రీకాళహస్తి టిక్కెట్ వచ్చింది. కాని ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 1999లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరి.. ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్గా నియమించారు. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన.. చివరికి జనసేనలో చేరారు.
తిత్లీ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘జియో ట్యాంగింగ్ ద్వారా తమకు జరిగిన నష్టాన్ని ఫొటోలు తీసి పంపాలని ప్రజలను కోరుతూ.. ఏపీ సర్కారు ఓ యాప్ ప్రారంభించింది. కానీ ఆరు రోజులు గడిచినప్పటికీ.. ఇంకా సగం గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయ’ని పవన్ తెలిపారు. చీకట్లో మగ్గుతున్న వారికి వెలుతురును ప్రసాదించడంటూ సీఎం చంద్రబాబును కోరుతూ పవన్ ట్వీట్ చేశారు. బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారని జనసేనాని తెలిపారు.
‘సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో నా పర్యటన కారణంగా పునరావాస, సహాయక కార్యక్రమాలకు అటంకం కలుగుతుందని అలాంటివి జరగకూడదనే తాను పర్యటనను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకున్నానని పవన్ అన్నారు. తన పర్యటన వల్ల ఎలాంటి అవరోధాలు తలెత్తొద్దని భావించానన్నారు. అందుకనే తన పర్యటనను వాయిదా వేసుకున్నానని చెప్పారు. అంతే కానీ కవాతు వల్ల కాదని పవన్ తెలిపారు. విమర్శలు దిగే ముందు నిగ్రహం పాటించడం నేర్చుకోవాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు.
ఇక మరో ట్వీట్ లో.. మీరు చేసే ప్రతి అర్థ రహితమైన విమర్శకు భవిష్యత్తులో జవాబుదారీతనం వహించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏదీ మా దృష్టికి రాకుండా పోవడం లేదంటూ టీడీపీ నేతలను జనసేనాని హెచ్చరించారు. జనసేన పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ. మా క్షేత్ర స్థాయి పర్యటనలను విమర్శించడం మానుకోండి. టీడీపీ విజయంలో మేం కీలక పాత్ర పోషించిన విషయం మర్చిపోవద్దని పవన్ ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more