కేరళలోని ప్రవిత్ర పుణ్యక్షేత్రం శబరిగిరీశుడి అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. స్థానికంగా మహిళా భక్తులకు, అందోళనకారులకు మధ్య ఉద్రిక్తతను రాజేస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అనంతరం శబరిమల ఆలయం తొలిసారిగా ఇవాళ తెరుచుకోవడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు మహిళలు ఇవాళ పంబకు చేరుకున్నారు.
అందోళనకారులు నిరసనలతో అట్టుడుకుతున్న శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు చేపట్టారు. అయ్యప్ప దర్శనార్థం వచ్చిన మహిళలకు పోలీసులు రక్షణగా నిలిచి అలయ దర్శనానికి తీసుకెళ్లారు. అయితే ఆలయంతో పాటుగా ఆలయానికి చేరుకునే అనేక మార్గాల్లో అందోళనకారులు మహిళలను ఎట్టి పరిస్థితుల్లో ఆలయ ప్రవేశం చేయనీయమని.. వారిని అడ్డుకునేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు.
శబరిమలకు వెళ్లే ప్రధాన మార్గం అయిన నీలక్కల్ వద్ద ఆందోళనకారులు ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఆలయానికి 20 కి.మీ దూరం ఉండే నీలక్కల్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షించారు. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ శబరిమల ఆచార సంరక్షణ సమితి సభ్యులు నీలక్కల్ వద్ద ఆందోళనకు దిగారు. టెంట్లు వేసుకొని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బస్సులు, వాహనాలను నిలిపివేసి అందులో ఆలయ దర్శనానికి వెళ్తున్న మహిళలను దింపివేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని.. టెంట్లను తొలగించి వారిని చెదరగొట్టారు. భక్తులను అడ్డుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నీలక్కల్ ప్రాంతం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. ఇక్కడ 800 మంది పోలీసులతో పాటు 200 మంది మహిళా పోలీసులు కూడా మోహరించారు. ఇక సన్నిధానం వద్ద మరో 500 మంది పోలీసులు సుప్రీంకోర్టు అదేశాలను పాటించేందుకు రంగంలో వున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more