Hanumantha vahana seva for Lord sri varu at tirumala అన్నపూర్ణ దేవీగా దుర్గమ్మ.. హనుమంత వాహనంపై శ్రీవారు..

Kanaka durga devi in annapurna devi avatar today

Kanaka Durga temple, annapurna devi, hanumantha vahanam, Dasara festival celebrations, Vijayawada, Gayatri devi, Navaratri fest, simha vahanam, muthyala pandiri, Garuda Seva, Ghatasthapana, Lord Venkateswara, Navaratri, ‪Muhurta‬‬m, chinna shesha vahanam, Hamsa vahanam, indrakeeladri, Alampur

As a part of Annual Navaratri brahmotsavam, on sixth day lord Sri Venkateshwara swamy toured tirumada veedhulu on hanumantha vahanam. Meanwhile Kanaka Durga devi atop Indrakeeladri hills is in Annapurna Devi Avatar and blessing devotees.

అన్నపూర్ణ దేవీగా దుర్గమ్మ.. హనుమంత వాహనంపై శ్రీవారు..

Posted: 10/15/2018 11:20 AM IST
Kanaka durga devi in annapurna devi avatar today

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల బ్రహోత్సవాలలో అత్యంత కీలక ఘట్టమైన గరుడ సేవ క్రితం రోజు రాత్రి అత్యంత భక్తిశ్రద్దలతో జరిగింది. ఈ సేవను వీక్షించేందకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. లక్షలాధిగా తరలివచ్చిన భక్తులు తిరుమాడ వీధులతో పాటు సప్తగిరిలు జనసంద్రాన్ని తలపించాయి. అర్ధరాత్రి వరకు తిరువీధుల్లో తనకు అత్యంతప్రీతిపాత్రుడైన గరుత్మండిపై జనసంద్రం మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ అభయన ప్రధానం చేశారు.

గరుడ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారి దర్శనాన్ని భక్తకోటికి కల్పించారు. గతం కంటే గరుడోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. మాడవీధుల వెంట ఇరువైపులా ఉన్న భక్తుల వద్దకు వాహనాన్ని మళ్లించి నెమ్మదిగా ముందుకు సాగుతూ శ్రీవారిని చూపించారు. మూలవిరాట్టుకు అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల వంటి విశేష తిరువాభరణాలను ఉత్సవమూర్తికి అలంకరించడం గరుడసేవ ప్రత్యేకత. ఈ తిరువాభరణాలతో మలయప్పస్వామి దేదీప్యమానంగా వెలుగొందారు. కాగా ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగారు. కాగా ఇవాళ సాయంత్రం పుష్పపల్లకి, గజవాహన సేవలు,

ఇక ఇంద్రకీలాద్రి కనకదుర్గాదేవి ఆలయంతో పాటు, శ్రీశైల బ్రమరాంభికాదేవీ ఆలయం, శ్రీకాళహస్తిలోని వాయులింగశ్వన ఆలయంతో పాటు పాలమూరు జిల్లా ఆలంపూర్ అమ్మవారి దేవాలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజైన సోమవారం దుర్గమ్మవారు భక్తులకు అన్నపూర్ణదేవిగా దర్శనం ఇస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవి అలంకారాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టుకుని ప్రజల ఆకలి దప్పులను తీర్చే తల్లిగా అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది.

ఆదివారం మూల నక్షత్రం కావడంతో సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం మాత్రం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. కొండపై ఉన్న క్యూలైన్లలో మాత్రమే భక్తులు కనిపిస్తున్నారు. అన్నపూర్ణ దేవీ అలంకారంలోని అమ్మవారికి అర్చక బృందాలు ప్రత్యేక అర్చనలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. పలువురు మహిళా భక్తులు ఆలయాల్లో అమ్మవారి సహస్రనామాలను పటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles