ఆధార్ చట్టబద్దమైనదంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో ఎవరూ డూప్లికేట్ ఆధార్ ను పొందలేరని.. పేర్కోన్న అత్యున్నత న్యాయస్థానం.. ఆధార్ వల్ల దేశ పౌరుల వ్యక్తిగత స్వేచ్చకు ఎలాంటి భంగం కూడా వాటిల్లదని పేర్కొంది. ఆధార్ చట్టానికి అనేక మార్పులు చేసిన సుప్రీం.. ఆధార్ డేటాను ప్రైవేటు కంపెనీలు సేకరించేందుకు అనుమతించిన సెక్షన్ 37ను రద్దు చేస్తూ అత్యంత కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది.
దీంతో ప్రభుత్వ పథకాలు వక్రమార్గం పట్టకుండా అర్హులకు పథకాలు చేరుతాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.అయితే ఇదే సమయంలో ఆధార్ ను అనుసంధానం తప్పనిసరేమీ కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆధార్ వివరాల పేరిట ప్రజల నుంచి తీసుకున్న సమాచారం చాలా స్వల్పమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్ల అనుసంధానంకు ఆధార్ అక్కర్లేదని పేర్కొంది. మొబైల్ సంఖ్యకు ఆధార్ తప్పనిసరి చేస్తూ డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం) పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.
ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు ఆధార్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆధార్ అనుసంధానం, ఆధార్ చట్టబద్ధతపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. 38 రోజుల పాటు విచారణ సాగగా, దేశంలోకి చట్ట వ్యతిరేకంగా చొరబడిన వారు ఆధార్ లబ్ధిని పొందకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించవచ్చని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టంలోని 139ఏఏ ప్రకారం, ఐటీ రిటర్నుల దాఖలు సమయంలో ఆధార్ సంఖ్యను వెల్లడించడం తప్పనిసరని తెలిపింది.
ఇక స్కూల్ అడ్మిషన్ల విషయంలో ఆధార్ పై స్పందిస్తూ, సెక్షన్ 7 కింద స్కూల్ అడ్మిషన్, విద్యార్థికిగానీ, అతని తల్లిదండ్రులకు గానీ దక్కే ప్రయోజనం ఏమీ లేదని, దీనివల్ల ఆధార్ సంఖ్య నమోదు తప్పనిసరేమీ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆధార్ లేదని స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకపోవడం నేరమని పేర్కొంది. సీబీఎస్ఈ, నీట్, యూజీసీ తదితరాలు ఆధార్ ను తప్పనిసరి చేయకుండా ఉండాల్సిందని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more