దేవుడి సొంత రాష్ట్రంపై వరుణుడు పగబట్టాడా.? ఈ నెల 8 నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మొత్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అయినా వరుణుడు మాత్రం శాంతించడం లేదు. మరో రెండు మూడు రోజుల పాటు వర్షం కురుస్తుందన్న భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు మూడు తరాలు చూడని జలవిళయాన్ని కనబరుస్తున్న వరుణుడు.. ఎందుకిలా తమపై పగబట్టాడని ప్రశ్నిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు కేరళలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్యల 324కు చేరింది.
గత వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళ రాష్ట్రంలో వర్షాలు విలయతాండవం చేస్తున్నాయని.. వీటి ఫలితంగా ఏర్పడిన వరదలు వందేళ్లుగా తాము కనివినీ ఎరుగమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అందోళన వ్యక్తం చేశారు. గత తొమ్మిది రోజులుగా ముంచెత్తుతున్న వర్షాలు, విరుచుకుపడుతున్న వరదలు, విరిగి పడుతున్న కొండ చరియలతో మృతిచెందిన వారి సంఖ్య 324కు చేరిందని.. ఒక్క బుధవారం రోజునే 100 మంది మృత్యువాత పడినట్టు కేరళ ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రాన్ని అతలాకుతులం చేస్తున్న వర్షాలు, ముంచుకొస్తున్న ప్రమాదంపై తాజా వర్ష సూచనలు, హెచ్చరికలు జారీ చేశామన్నారు. 2 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని, రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో పడిందని చెప్పారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, అయితే మరింతగా కేంద్ర సాయం కావాలని తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారని తెలిపారు. ఇవాళ కేరళకు రానున్న ప్రధాని మోదీకి పరిస్థితిని వివరిస్తానని చెప్పారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ తో ఇవాళ ఉదయం మాట్లాడానని, మరిన్ని హెలికాఫ్టర్లు కోరానని తెలిపారు.
కేరళలోని వర్ష ప్రభావిత 14 జిల్లాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో వరదల్లో చిక్కకున్న వారిని రక్షించేందుకు ఎయిర్ లిఫ్టింగ్ తప్ప మరో మార్గం లేదని తెలిపారు. అనేక మందిని ముంపు ప్రాంతాల నుంచి రక్షించినా ఇంకా వేలాది మంది ముంపు ప్రాంతాల్లో సహాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తీవ్రంగా దెబ్బతిన వరద ప్రాంతాలకు మరో 11 హెలికాప్టర్లు పంపుతున్నామని సీఎం తెలిపారు. కాగా, అళపుజ, ఎర్నాకుళం, త్రిసూర్, పథనాంతిట్ట ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతాలన్నీ ముంపులో చిక్కుకున్నాయి. త్రిసూర్, చాలకుడి పట్టణాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. సహాయ శిబిరాల్లోకి కూడా నీరు వచ్చిచేరుతోంది.
అపార నష్టం..
గత వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకోవడంతో.. కేరళలో అపార నష్టం వాటిల్లింది. ఇంకా వరుణుడి తన ప్రకోపాన్ని చాటుతున్న క్రమంలో నష్టం విలువను కూడా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 324కు చేరింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్లు నెలమట్టం కాగా, కొన్ని మాత్రం పాక్షికంగా ధెబ్బతిన్నాయని తెలిపారు. అయితే తాము సర్వం కోల్పోయామని నిరాశ్రయులు అందోళన చెందుతున్నారు. కాగా, 2,23,139 మంది ప్రజలు 1500కు పైగా శిబిరాల్లో తలదాచుకుంటున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ట్వీట్లో తెలిపింది. 30 బ్రిడ్జిలు కూలిపోయాయని, లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని అంచనా వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more