తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై దేశంలోని ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కళైంజ్ఞర్ కరుణకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయన అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. భారత దేశం.. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఆయన్ని కోల్పోయిందని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరుణానిధి మరణ వార్త యావత్తు దేశానికే తీరని లోటని గవర్నర్ నరసింహన్ అన్నారు. వీరితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.
దేశం రాజకీయ యోధుడిని కోల్పోయిందని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాహిత్యం, సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో కరుణానిధి విశేష కృషి చేశారని కొనియాడారు. సేవాభావం, పాలనా అనుభవంతో ప్రజల గుండెల్లో కరుణానిధి నిలిచిపోయారని, నిరుపేదలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన నిత్యం పరితపించారని అన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ప్రకటనలో కరుణానిధి మృతి పట్ల ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి కరుణానిధి అని, దేశ రాజకీయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
ఇటు అంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ కరుణానిధి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన తుదిశ్వాస విడవడం విషాదంలో ముంచిందని అన్నారు. ద్రవిడ ఉద్యమ తపోపుత్రుడైన ‘కలైంగర్’ కరుణానిధి అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారని ఆశించానని, వారి అస్తమయం కేవలం తమిళనాడుకే కాక యావత్ దేశానికీ, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి తీరనిలోటని పేర్కోన్నారు. కరుణానిధి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
తమిళనాడు రాజకీయాలే కాదు భారత రాజకీయ చిత్రంపై కరుణానిధి ముద్ర బలంగా ఉందని అన్నారు. రచనా వ్యాసంగం నుంచి రాజకీయ యవనిక పైకి వచ్చిన కలైంగర్ గానే తమిళుల హృదయాల్లో ఆయన నిలిచారంటే తమిళ సాహిత్యంపై వారి ప్రభావం ఎంత ఉన్నతమైనదో తెలుస్తుందని అన్నారు. రచయితగా, సంస్కృతి పరిరక్షకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ పార్టీ అధినేతగా, రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రిగా కరుణానిధి వేసిన ఉన్నతమైన బాటలు నేటి తరానికి, భావి తరాలకు చిరస్మరణీయాలని పవన్ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అటు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కరుణానిధి మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరుణానిధి మృతి చెందిన ఈరోజును ‘బ్లాక్ డే’ గా రజనీ అభివర్ణించారు. ఈ బ్లాక్ డేను తాను ఎప్పుడూ మర్చిపోలేనని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. కరుణానిధి అస్తమయంతో తమిళ కళాకారులు కూడా స్పందించారు. వారికి కళైంజ్ఞర్ తో ఉన్న అనుబంధాన్ని పలువురు నటులు గుర్తు చేసుకున్నారు. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని, ఆయన్ని మిస్సయ్యాం కానీ, ఆయన సంక్పలం మాత్రం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని ప్రముఖ నటి రాధిక అన్నారు. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారని, ఆయనకు కన్నీటి వీడ్కోలు చెబుతున్నానని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు.
కరుణ మృతిపై ప్రముఖ నటుడు, రాజకీయ నేత శరత్ కుమార్ స్పందించారు. కరుణ మృతి తమిళనాడుకి తీర్చలేని లోటు అని ఆయన అన్నారు. ‘‘గత 75 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించిన ఓ మహానేత ఆయన. ఇంతటి మహానేత ఇంతకు ముందు, ఇకపై ఎన్నడూ మనకి దొరకరు. అయన మరణం ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రంలో ఉన్న తమిళులకి తీరని లోటు. ఆయన కుటుంబానికి, డీఎంకే కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
మరోనటి హన్సిక స్పందిస్తూ, కరుణానిధి మరణ వార్తను జీర్ణించుకునే ధైర్యం ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, యావత్తు తమిళ ప్రజలకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ నటి ఖుష్భూ స్పందిస్తూ, నెల క్రితమే కరుణానిధితో కలిసి ఓ ఫొటో దిగానని, గొప్ప నాయకుడైన ఆయన్ని కలవడం అదే చివరిసారి అవుతుందని అనుకోలేదని తన ట్వీట్ లో చెప్పింది. ‘అప్పా, మేమ మిమ్మల్ని మిస్సవుతున్నాం’ అని ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, కరుణానిధి మరణవార్త తెలియగానే డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానలు విషాదంలో మునిగిపోయారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు గోపాలపురంలోని కరుణానిధి ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసుల అంక్షలు వున్న నేపథ్యంలో వారిని రాజాజీ హాలు వద్దకు మళ్లించారు. తమిళనాడులో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
My thoughts are with the family and the countless supporters of Karunanidhi Ji in this hour of grief. India and particularly Tamil Nadu will miss him immensely. May his soul rest in peace. pic.twitter.com/7ZZQi9VEkm
— Narendra Modi (@narendramodi) August 7, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more