భక్తివిశ్వాసాలకు మన దేశంలో పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా ధక్షిణ భారతావనిలో ప్రతి జీవరాశిలోనూ దేవుణ్ణి చూసే తత్వం వుంది. ఏ అపద వచ్చినా దేవుళ్లను, దేవతలనే పరిష్కరిచాలని కోరుకుంటాం. అలాంటిది దేవతకే కష్టం వచ్చి కన్నీరు కారిస్తే.. దేవతలకు కష్టమా.. అని కొట్టిపారేడం హేతువాదులు చేసే పని అయితే.. దానిని కూడా పరిగణలోకి తీసుకుని అమ్మవారికి శాంతి చేకూర్చడం భక్తుల చేసే పని. వినడానికి కొంత వింతగా అనిపించినా.. ఇలాంటి అచారాలతో ముడిపడినదే మన ప్రాంతం. అందుకే ఇది పుణ్యభూమి అని కూడా కీర్తికెక్కింది.
అయితే కొందరు మాత్రం ఇది మూడభక్తి అని వ్యాఖ్యానించినా.. దేవుడి మీద మూఢభక్తి వుంటే తప్పేంటి అన్న ప్రశ్నలు సైతం భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వేమచెట్టు నుంచి పాలు కారుతున్నాయన్న వార్తలు భక్తులను ఒకింత కలవరానికి గురిచేస్తే.. తాజాగా సిద్ధిపేటలోని రేణుకా ఎల్లమ్మ దేవత కన్నీరు కారుస్తుందన్న వార్త కలవరానికి గురిచేస్తుంది. అమ్మవారి విగ్రహం కన్నీరు కారుస్తుందన్న విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
జిల్లా పరిధిలోని చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలోని విగ్రహం నుంచి గత రెండు రోజులుగా కన్నీరు వస్తోందని ప్రచారం సాగుతోంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా, చంద్లాపూర్ గ్రామం ముంపు గ్రామమైంది. దీంతో అమ్మకు బాధకలిగిందని, అందువల్లే రేణుక ఎల్లమ్మ తల్లి ఏడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక మరికొందరు భక్తులు మాత్రం సరిగ్గా బోనాలకు మరో పక్షం రోజులు వుందనగానే అమ్మవారు ఇలా కన్నీరు కార్చడమేంటని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏ అనర్థానికి దారితీస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more