వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా బాసిల్లుతున్న విజయవాడలోకి ప్రవేశించింది. ఇటీవలే వెయి కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకుని కొనసగుతున్న జగన్ యాత్రతో.. బెజవాడలోని పార్టీ నేతలు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని జోడించింది. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉదయం నుంచి జగన్ యాత్ర కోసం నీరిక్షిస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాకతో పెద్దపెట్టున నినాదాలు చేశారు.
అశేషంగా వచ్చిన జనసందోహాన్ని చూసిన పార్టీ శ్రేణులు.. తమ అధినేతపై రాష్ట్ర ప్రజలకు వున్న అదరణకు ఇది ప్రతిరూపమని, రానున్న ఎన్నికలలో అదే ఆదరణతో తమ వైఎస్సార్ సిపి పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే.. అధికార తెలుగుదేశం పార్టీని బంగళాఖాతంలోకి విసిరేస్తారని విమర్శించారు. అశేష జనసందోహం మధ్య ఆయన నగరంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన యాత్ర బందరు రోడ్డుకు చేరుకుంది.
ఈరోజు ఆయన కనకదుర్గవారధి గుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి, వెటర్నరీ ఆసుపత్రి సెంటర్, శిఖామణి సెంటర్, పుష్పా హోటల్ సెంటర్, సీతారాంపురం సెంటర్, కొత్త వంతెన, బీఆర్టీఎస్ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట, చిట్టినగర్ వరకు పాదయాత్ర చేస్తారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద యాత్ర ముగుసిన అనంతరం ఆయన చిట్టినగర్ సెంటర్ లో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. దీంతో ఇవాళ్టి యాత్ర ముగుస్తుంది. కాగా ఇవాళ ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభించేందుకు ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు.
అశేష జనసందోహం నడుమ ఘనంగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర#PrajaSankalpaYatra pic.twitter.com/kVYq360TBn
— YSR Congress Party (@YSRCParty) April 14, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more