కర్ణాటక రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారి.. కేంద్రంలోని అధికార బీజేపిని కేవలం అడుగుతున్నా.. (జస్ట్ అస్కింగ్) పేరుతో ఇరుకున పెడుతున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి అసెంబ్లీకి రావడంలో అంతర్యమేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని, అయితే కేవలం జాతీయతా భావం వారికి మాత్రమే సొంతమైనట్లు, హిందుత్వం కూడా తమ సొంతమే అన్నట్లు వాదిస్తూ.. దేశంలో మతాల మధ్యన అనిశ్చిత వాతావారణాన్ని తీసుకువచ్చిన బీజేపిని మాత్రం కర్ణాటకలో అధికారంలోకి రానీవ్వబోనని చెప్పిన ప్రకాష్ రాజ్ తో సీఎం కేసీఆర్ అంత ప్రత్యేకంగా చర్చించడానికి గల కారణాలు ఏమిటన్నది తెలియాల్సి వుంది.
ప్రగతి భవన్లో కేసీఆర్ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి భోజనం చేశారు. ఈ భేటీ వెనుక రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ పై సీఎం కేసీఆర్ ప్రకాష్ రాజ్ తో చర్చించనున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కేసీఆర్ ఏకం చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఇటీవలే కేసీఆర్ కలిశారు. అయితే ప్రకాష్ రాజ్ సేవలను కూడా తమ ఫెడరల్ ఫ్రంట్ కు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారా..? అన్న విషయాన్ని పక్కనబెడితే.. పలు అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ తాను గతంలో చెప్పినట్లుగా, నువ్వు కోట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్నట్లుగా కేంద్రంలోని అధికార బీజేపీని నిందిస్తూనే.. ఆయన బీజేపికి అనుకూలంగా వ్యవహరిస్తూ పావులు కదుపుతున్నారా..? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సరిగ్గా కర్ణాటక రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్డు విడుదలైన తరువాతి రోజునే ప్రకాష్ రాజ్ తో కేసీఆర్ భేటీ కావడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తన సోదరి, ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త గౌరీలంకేశ్ హత్య జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీపై, బీజేపీ నేతలపై ప్రకాష్ రాజ్ విమర్శలు సంధిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more