2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంలో అంతర్యమేమిటో ఇప్పటికీ తనకు అర్థమే కాలేదని, అసలు దాని వెనకనున్న లాజిక్ ఏంటో కూడా తెలియలేదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. కోల్ కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించిన ఆయన తాను ఆర్థికశాస్త్ర నిపుణుడిని కాదని అంటూనే దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ తనకు అర్థంకావడం లేదని అన్నారు.
అవినీతి, అక్రమాలకు పెద్ద నోట్లు పునాది వేస్తున్నాయన్న కేంద్రం వివరణ సమంజసంగానే వున్నా.. రమారమి మళ్లీ అదే నోటును లేక అంతకన్నా పెద్ద నోటును చెలామణిలోకి తీసుకురావడంలో వున్నఅంతర్యమేమిటన్నది తనకు అర్థంకాని విషయమన్నారు. అయితే నోట్ల రద్దు నిర్ణయాన్ని పట్టణ మేధావులు వ్యతిరేకించగా, గ్రామీణ భారతీయులు మాత్రం స్వాగతించారని ఆయన చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయంపై నిపుణులు మాత్రమే సమాధానం చెప్పగలరని ఆయన అన్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ పోవడానికి కారణం స్వల్పశ్రేణి తయారీ రంగంపై దృష్టి సారించకపోవడమేనని ఆయన అన్నారు. 1950 నుంచి చైనా, జపాన్ లు ఈ రంగంపై దృష్టి సారించగా, మనం మాత్రం దానిని పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. మన దేశంలో స్కూల్ కి వెళ్తున్న చిన్నారుల్లో 75 శాతం మంది 8వ తరగతిలో చేరకముందే బడి డ్రాపవుట్లుగా మారుతున్నారనిన అయన అవేదన వ్యక్తం చేశారు. అయితే వీరికి వున్న విద్యార్హతల నేపథ్యంలో ఉపాధి లభించే అవకాశాలు తక్కువన్నారు.
కాగా ఇలాంటి వారి సమస్యను స్వల్పశ్రేణి తయారీ రంగం తీర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా నిరుద్యోగులకు 22 ఏళ్లకు చేరుకునే సరికి వారికి ఉపాధి కల్పించాలని, అలా జరగాలంటే స్వల్పశ్రేణి తయారీరంగంపై ఇప్పటికైనా దృష్టిసారించాలని ఆయన సూచించారు. దురదృష్టవశాత్తు భారత్ లో స్వల్ప శ్రేణి తయారీ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా మనదేశ ఆర్థికవేత్తలు దీనిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more