రానున్న సార్వత్రిక ఎన్నిలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో తొలిసారిగా తమ పార్టీ కూడా ప్రత్యేక్ష ఎన్నికలలో పాల్గోంటుందని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యచరణను పూర్తి చేసి జిల్లాలలు, మండలాలు, గ్రామాలు, పొలింగ్ బూత్ స్థాయిలో తన క్యాడర్ ను ఏర్పాటు చేసుకుని చాపకింద నీరులా తన పార్టీ కార్యక్రమాలను బహాటంగా బయటకు కనిపించకుండా లోలోన చేసుకుంటూ ముందుకుసాగుతన్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్.. పిలుపుమేరకు తెలుగు రాష్ట్రాల యువత గుంటూరులోని నాగార్జునా యూనివర్శిటీకి చేరుకుంటుంది.
ఓ వైపు ఉత్తరాంధ్ర యువతరం, మరో వైపు అమరావతి యువత, ఇటు హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర జనసైనికులు నాగార్జున యూనివర్శిటీకి ఇప్పటికే పెద్దస్థాయిలో చేరుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ యువతకు దిశానిర్దేశం చేసే అత్యంత కీలకమైన సభకావడంతో పార్టీలోని జిల్లా, మండల, బూత్ స్థాయి నుంచి జనసైనికులు అందరూ సభకు కదులుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సభకు రావాలని అమ అధినేత పవన్ కల్యాన్ పిలుపునివ్వడంతో దానిని అందుకున్న నేతలు ఇప్పటికే బస్సులలో మంగళగిరిలోని నాగార్జునా యూనివర్శటిలోని సభస్థలికి చేరుకున్నారు.
జనసేన పార్టీ నాలుగో వ్యవస్థాపక దినోత్సవ సభ సందర్భంగా మంగళగిరిలోని నాగార్జునా యూనివర్శిటీలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పవన్ కల్యాన్ స్వయంగా పరిశీలించారు. ఈ సభఏర్పాట్లను జనసేన సీనియర్ నేత మాదాసు గంగాధరానికి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో తనకు పవన్ కల్యాన్ అప్పగించిన భాధ్యతల నేపథ్యంలో మాదాసు రమారమి సభస్థలి వద్దే రెండు రోజలుగా మకాం వేసి మరీ ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా ఈ సభావేధిక ద్వారా జనసేన పార్టీపై వున్న అపోహలన్నింటికీ పవన్ స్పష్టతనిస్తారని తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ కార్యచరణ ఎలా వుండబోతుందన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించే అవకాశాలున్నాయని పార్టీ సైనికులు అంటున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అర్థికంగా వెనకబడిన రాష్ట్రానికి ప్యాకేజీ ఇస్తామని, ఇప్పుడు ఆ హామీకి కూడా కేంద్రం న్యాయం చేయకుండా రాష్ట్రాన్ని అదోగతిపాటు చేస్తున్న తీరుపై జనసేనాని కదంతొక్కనున్నారని సమాచారం. ఇకపై పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులను బలపర్చుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదిగేందుకు సిద్దమవుతున్న జనసేన సభను విజయవంతం చేయడానికి జనసైనికులు కూడా భారీసంఖ్యలోనే తరలివస్తున్నారు. ఈ సభలో పాల్గొనడానికి విశాఖ నుంచి 30 బస్సులు, 468 వాహనాలతో పాటు విజయనగరం నుంచి 4 బస్సులు, 160 కార్లు, శ్రీకాకుళం జిల్లా నుంచి 15 బస్సులు, 270 ఇతర వాహనాల్లో జనసైనికులు తరలివస్తున్నారు. దీంతో నాగార్జునా యూనివర్శిటీలో సాయంత్రం జనసైనికుల నినాదాలతో మార్మోగడం ఖాయం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more