తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ తన రాజకీయ ప్రస్థానంతో హాట్ టాపిక్ గా మారారు. నేటి సాయంత్రం మధురైలోని బహిరంగ సభలో ఆయన పార్టీ ప్రకటన, జెండాను ప్రదర్శించనునన్న విషయం తెలిసిందే. ఈ ఉదయం రామేశ్వరంలోని అబ్దుల్ కలామ్ స్వగృహం నుంచి ఆయన తొలి అడుగు వేశారు. కలామ్ కు నివాళులు అర్పించిన ఆయన, రామేశ్వరం, పరమకొడి, మధురై ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
సాయంత్రం ఆరు గంటలకు చివరిగా బహిరంగ సభలో తన పార్టీ పేరు, జెండా తదితర వివరాలను కమల్ స్వయంగా వెల్లడించనున్నారు.ఇప్పటికే కమల్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ తోనూ కలసి చర్చించిన సంగతి తెలిసిందే. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే కమల్ సమావేశాలు నిర్వహించడాన్ని పరిశీలిస్తుంటే, ఆయన కేంద్రంలోని అధికార కూటమికి సాధ్యమైనంత దూరంగానే ఉంటారన్న సంకేతాలు వెలువడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హాజరయ్యే వారి వివరాలు...
నేడు కమల్ మధురైలో నిర్వహించే సభకు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా పాల్గొననుండటం గమనార్హం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బీహార్ సీఎం, జనతాదళ్ యునైటెడ్ చీఫ్ నితీశ్ కుమార్ లు హాజరు కానున్నారు. వీరితో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ సీఎంలు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, కే చంద్రశేఖర్ రావులను కూడా కమల్ ఆహ్వానించారని తెలుస్తుండగా, వారు పాల్గొంటారా? లేదా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ సభను కవర్ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ మీడియా సంస్థలకూ ఆహ్వానాలు అందాయి. ఢిల్లీ, కోల్ కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి కూడా వార్తాసంస్థల ప్రతినిధులు ఇప్పటికే మధురై చేరుకున్నారని తెలుస్తోంది.
మదురైలోని 'ఓక్స్' గ్రౌండ్ వేదికగా ఈ బహిరంగ సభ జరుగనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు మదురైతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన తేని, విరుద్ నగర్, రామనాథపురం, శివగంగై, దిండిగల్, పుదుకొట్టాయ్, తిరుచిరాపల్లి, కరూర్, తిరువూర్, తంజావూరు, నాగపట్టణం తిరునల్వేలి ప్రాంతాల్లోని అభిమాన సంఘాల నేతలు నడుంబిగించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ముఖ్యమంత్రులు మధ్యాహ్నానికి మదురై చేరుకుంటారని కమల్ హాసన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలతో పాటు.. ఎండీఎంకే, డీఎండీకే వంటి చిన్నా చితకా పార్టీలు ఉండగా,విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న కమల్ రాజకీయ ప్రస్థానం హాట్ టాపిక్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more