సన్మార్గుల ముసుగులో ఉన్నత పదపులను చేతబట్టి.. బద్దివక్రించి.. దేవుడికే పంగనామాలు పెట్టిన ఘనులకు తమిళనాడు సిఐడీ అరదండాల వేసి కటకటాల వెనక్కి నెట్టారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురంలో భక్తుల అనుమానాలు నిజమయ్యాయి. ఆలయ అధికారుల మోసానికి పాల్పడి దేవుడి సొమ్మను కూడా దోచుకున్నారు. దీనిపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేయడం, ఏకంగా న్యాయస్థానాలనే అశ్రయించడంతో.. మొత్తం వ్యవహారం భయటకువచ్చింది.
కాంచీపురంలోని పురాతనమైన ఏకాంబరేశ్వర ఆలయంలోని స్వామి వారికి, అమ్మవారికి బంగారు నగలు బదులు గిల్ట్ నగలు ఉన్న విషయం తాజాగా బయటపడింది. ఈ సంఘటనలో తొమ్మిది మందిపై పోలీసులు ఈరోజు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఏకాంబరేశ్వర ఆలయంలోని స్వామి వారికి, అమ్మ వారికి నగలు చేయించేందుకు ఆలయకమిటీ నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ స్తపతి, ఆలయ మేనేజర్, నగల తయారీదారులకు ఆరు కిలోల బంగారాన్ని అందజేయగా, బంగారు నగలు తయారు చేసి దేవతా విగ్రహాలకు అలంకరించడం జరిగింది. ఇదిలా ఉంచితే, తాజాగా పట్టణంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రెండు పంచలోహ విగ్రహాలు దొరికాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు, ఈ విగ్రహాల విషయమై విచారణ ప్రారంభించగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ విగ్రహాలు ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలోవని పోలీసుల విచారణలో బయటపడింది.
ఆలయంలోని పంచలోహ విగ్రహాలను బయట తాకట్టుపెట్టి, వాటి స్థానంలో నకిలీ విగ్రహాలను ఉంచినట్టు తేలింది. దీంతో పాటు మరో ఆశ్చర్యకర విషయం కూడా వెలుగు చూసింది. ఆలయంలోని బంగారు నగలను తాకట్టుపెట్టి వాటి స్థానే గిల్ట్ నగలను ఉంచినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. స్తపతి, ఆలయ మేనేజర్, నగల తయారీదారు సహా తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more