టీమిండియా పరుగులు మెషీన్, జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అటు తన పరుగుల ప్రహసనాన్ని కొనసాగిస్తూ.. తన కెరీర్ లో అనేక మైలురాళ్లను అధిగమిస్తూ.. కొత్త రికార్డులను లిఖించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న వేళ్ల.. అతనికి దేశ, విదేశాల్లో అభిమానుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతూ పోతుంది. దీంతో కోహ్లీని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అతని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న అభిమానుల సంఖ్య కూడా అధికంగానే వుంది. తన పరుగుల వేగం మాదిరిగానే అతడ్ని ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్యకూడా అంతే వేగంగా పెరుగుతూ పోతుంది.
సామాజిక మాధ్యమైన ట్విట్టర్లో కోహ్లి ఫాలోవర్లు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎంత వేగంగా పెరుగుతుందంటే ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీనే అధిగమించాడు కోహ్లి. తాజాగా ట్విట్టర్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఏడాది మోదీ ఫాలోవర్ల సంఖ్య 52 శాతం పెరగ్గా, కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 61 శాతంతో దూసుకుపోయింది. ప్రస్తుతం కోహ్లిని 20.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
కాగా భారతదేశంలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా మాత్రం ప్రధాని మోదీ తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. మోదీకి ఇప్పటివరకు 37.5మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఎక్కువ మంది ఫాలో అవుతున్న టాప్ 10 సెలబ్రిటీలలో మోదీ తరువాత అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, దీపికా పదుకునే, సచిన్ టెండూల్కర్, హృతిక్ రోషన్, కోహ్లి స్థానాలను సంపాధించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more