సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. అక్రమాస్థుల కేసు విచారణలో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం సీబిఐ న్యాయస్థానంలో హాజరవుతున్నారు. అయితే రాష్ట్రంలో తాను ప్రధాన ప్రతిపక్షంగా వున్న కారణంగా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు.. ఆపై ప్రజా సమస్యలను క్షేత్ర స్థాిలో తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని జగన్ న్యాయస్థానాన్ని కోరారు.
జగన్ వేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు పిటీషన్ ను తోసిపుచ్చింది. కేసు విచారణలో వుండగా, నిందితుడికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కల్పించలేమని తేల్చిచెప్పింది. వారానికి ఒకరోజు హాజరు నుంచి వైసీపీ అధినేతకు ఎలాంటి మినహాయింపును కల్పించలేమని తీర్పను వెలువరింది. ఈ సందర్భంగా జగన్ దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించింది. ఈ క్రమంలో న్యాయస్థానం సిబీఐ న్యాయవాది వాదనలతో ఏకీభవించింది.
అక్టోబర్ 2 నుంచి మే 2 వరకు తాను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఆరు నెలల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్పై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది. జగన్ న్యాయవాది వాదనలతో పాటు సీబిఐ తరపు వాదనలను కూడా విన్న న్యాయస్థానం.. సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయబాలన్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం జగన్ కు ఈ సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కల్పించలేమని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ నేతలు రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more