గత ఏడాది చేపట్టిన నోట్ల రద్దుతో దేశ ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరాయని.. ఈ నిర్ణయం దేశ అభివృద్దిని వేగిరం చేసిందని కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. నోట్ల రద్దుతో దేశప్రజలకు చేకూరింది శూన్యమని.. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం తప్పి ప్రజలకు మిగిలింది మాత్రం ఏమీలేదని సెటైర్లు విసిరారు.
నోట్ల రద్దుకు ముందు ప్రధాని చేసిన ప్రసంగాలలో చెప్పిన లక్ష్యాలలో ఏ ఒక్కటీ కూడా నెరవేరలేదని. దీంతో నోట్ల రద్దు మిగిల్చిన గాయాలు దేశాభివృద్దిని గాయపరుస్తున్నా.. దానిని కప్పిపుచ్చి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ప్రచారం చేసుకోవడం ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికే చెల్లిందని ఆయన విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు నేపథ్యంలో కనీసం పదేళ్లపాటైనా ఏటా 8 నుంచి 10 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించి చూపాలని సూచించారు.
భారతదేశం తన చరిత్ర, సంస్కృతి తదితర విషయాలపై గొప్పలు చెప్పుకోవచ్చు కానీ యావత్ ప్రపంచ అర్థిక వ్యవస్థ నిపుణులు భారత్ నోట్ల రద్దు నేపథ్యంలో అశించిన లక్ష్యాలను అందుకోలేకపోయిందని విమర్శలు గుప్పిస్తున్నా.. ఇంకా ఆర్థిక వృద్ధి విషయంలో గొప్పలు చెప్పుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఎగుమతులు పెరిగి, ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరిగితే తప్ప భారత స్థూల వృద్ధి రేటు పెరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. భారత్ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, ఐదు రెట్లు ఎక్కువని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ దేశం ఆర్థిక వ్యవస్థ నత్తనడకన నడిచి, అదే సమయంలో భారత జీడీపీ పరుగులు పెడితే తప్ప దానిని అందుకోవడం అసాధ్యమన్నారు. ఆర్బీఐ గవర్నర్గా మూడేళ్లు పనిచేసిన రఘురామ్ రాజన్ గతేడాది రిటైరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more