కేంద్ర ప్రభుత్వం మరో భారాన్ని సామాన్యుడిపై వేసేందుకు సిద్ధమైపోతుంది. గ్యాస్ పై సబ్సిడీ భారాన్ని దించుకునే యత్నమే కాదు, ధర కూడా పెంచాలని ఈ నిర్ణయించుకుంది. ప్రతినెలా గ్యాస్ సిలెండర్ పై నాలుగు రూపాయల ధర పెంచాలని ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే మార్చి నాటికి వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం స్వయంగా వెల్లడించారు. ఇంతకు ముందు ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీ, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియనం ఆధ్వర్యంలోని గ్యాస్ ఏజెన్సీలకు రెండు రూపాయల చొప్పున పెంచాలని ఆదేశించిన కేంద్రం ఇప్పుడు దానిని రెట్టింపు చేయటం గమనార్హం.
ప్రతీ ఇంటికి సబ్సిడీ పేరు మీద ఏడాదికి 12 సిలిండర్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. పరిధి దాటితే మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేయాల్సిందే. ఇంతవరకు సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోండి అని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ...ఇప్పుడు గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసేందుకు నడుం బిగించారు.
ఆధార్ తో లింకు.. పాన్ చెల్లదు
పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసే గడువును ఆగస్టు 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈలోగా లింక్ చేయకపోతే పాన్ కార్డు రద్దవుతుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆదియా తెలిపారు. అలాగే ఆదాయపు పన్ను చెల్లించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కూడా ఆధార్, పాన్ లింక్ను తప్పనిసరి చేసింది. ఈ కారణంతోనే ఆదాయపు పన్ను చెల్లింపుల తేదీని కూడా ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్పై పడుతున్న భారాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూలై 1 నుంచి ఆధార్, పాన్ కార్డుల లింక్ను ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. కానీ చేయకపోతే పాన్ కార్డ్ రద్దవుతుందని వెల్లడించడం ఇదే మొదటిసారి. కాబట్టి వీలైనంత త్వరగా పాన్కార్డును ఆధార్ నెంబర్తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more