నగరం నిద్ర పోతున్న వేళ రాజేంద్రనగర్ లో పెద్ద హైడ్రామానే నడిచింది. తెలంగాణ 'ఆక్టోపస్' పోలీస్ దళాలు 'హ్యాపీ హోంస్' అపార్ట్ మెంట్స్ లో కదంతొక్కాయి. మంగళవారం మైలార్ దేవ్ పల్లిలో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి యత్నం జరిగిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ అలారం మోగించటంతో వారు పారిపోయారు. అయితే ఆ దుండగులు దోపిడీలో వాడిన కారు పార్క్ చేసినట్టు సీసీ కెమెరా విజువల్స్ లో బయటపడింది. దీంతో కారు గురించిన సమాచారం సెక్యూరిటీ గార్డు పోలీసులకు అందించాడు.
గుజరాత్ రిజిస్ట్రేషన్ తో ఉందని, నెంబర్ ప్లేట్ పగులగొట్టి ఉందని సమాచారం ఇచ్చాడు. అంతే కాకుండా, కారులో మారణాయుధాలు కూడా ఉన్నట్టు చెప్పాడు. దీంతో సీసీ కెమెరాను మరింత క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలతో రంగంలోకి దిగారు. రాత్రివేళ హ్యాపీ హోమ్స్ ను చుట్టుముట్టగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇళ్లల్లోని వారిని ఖాళీ చేయించి మరీ జల్లెడపట్టారు. హ్యాపీ హోమ్స్ లో ఉన్న 9 బ్లాకుల్లో దాదాపు 500 ఫ్లాట్లు ఉన్నాయి. అపార్ట్ మెంట్లన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపేసి అంగుళం అంగుళం తనిఖీలు చేశారు.
మరోవైపు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేసిన పోలీసులకు అవి పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 171 వరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో కొందరు దుండగులు వేరే వాహనంలో వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతుండగా, పోలీసులు మాత్రం తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని ప్రకటించటం విశేషం. కొంత కాలం క్రితం గుజరాత్ నుంచి వలస వచ్చిన కొందరు ఈ అపార్ట్ మెంట్ లో స్థిరపడినట్లు పలువురు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more