ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నితీష్ రోడ్డు ప్రమద ఘటనలో బెంజ్ కంపెనీ ప్రతినిధులు.. తెలంగాణ పోలీసులకు అసహనం కలిగించే రితీలో వ్యవహరిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ విషయమై కంపెనీ ప్రతినిధుల నుంచి తెలంగాణ పోలీసులు నివేదిక కోరగా.. నివేదిక ఇవ్వడంలో జాప్యం చేసిన బెంజ్ కంపెనీ ప్రతినిధులు పోలీసుల నుంచే మరిన్ని వివరాలను కోరి.. ప్రమాద ఘటపను దర్యాప్తు చేస్తున్న తరహాలో ప్రమాదానికి సంబంధించిన సిసిటీవీ ఫూటేజీలు.. పోస్టుమార్గం నివేదికతో పాటు దర్యాప్తు వివరాలను, ప్రమాదానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్లను కూడా కొరడంతో.. తెలంగాణ పోలీసులు అవ్వాకవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మంత్రి నారాయణ కుమారుడు నితీష్ మే నెల 10న అర్థరాత్రి జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను ఢీకొని దుర్మరణం పాలైన విషయం తెలిసింది. ఈ ప్రమాధంలో నితీష్ తో పాటు అతని స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మ కూడా మరణించిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడు అతని స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో.. ఈ ఘటనపై క్షణ్ణంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అటు బెంజ్ కంపెనీ నుంచి వివేదికను కోరారు. ప్రమాదానికి గల కారణాలు మితిమీరిన వేగమని ఓ వైపు చెబుతున్నా.. అసలు కారు బెలున్లు ఎందుకని ఓపెన్ కాలేదన్న విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ మేరకు బెంజ్ కంపెనీ ప్రతినిధులకు ఓ లేఖను రాసిన తెలంగాణ పోలీసులు కంపెనీ నుంచి పలు వివరాలను కోరారు. అత్యాధునిక కారులో కారు బెల్టు పెట్టుకుంటేనే తప్ప లేకపోతే బెలూన్లు తెరుచుకోవా..? కారు ఎంత వేగంలో వెళ్లిన తరువాత ప్రమాదానికి గురైంది..? అన్న వివరాలను కోరుతూ లేఖ రాయగా, బెంజ్ కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు. దీంతో మరోమారు లేఖ రాసిన తెలంగాణ పోలీసులకు తమకు అత్యంత గోప్యంగా వుండే పోలీసు దర్యాప్తు వివరాలను అందజేయాలని కంపెనీ ప్రతినిధులు కోరడంతో తెలంగాణ పోలీసులు విస్మయానికి గురయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more