కమ్యూనిస్ట్ పాలిత రాష్ట్రం కేరళలో దారుణం చోటు చేసుకుంది. గోవధ పై కేంద్రం చట్టాలను కఠినతరం చేస్తున్న సమయంలో.. అది రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించటమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం కేరళ కాంగ్రెస్ నేతలు దారుణానికి పాల్పడ్డారు. ఓ ఎద్దును నడిరోడ్డు మీదే దారుణంగా నరికి చంపి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
కన్నూర్ యూత్ కాంగ్రెస్ లీడర్ రిజిల్ మక్కుట్టి నేతృత్వంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డట్లు సమాచారం. రోడ్డు మీద నినాదాలు చేస్తూ ఒక్క సారిగా ఎద్దును తెగనరికేశారు. ఆపై దానిని వండే అక్కడే భోజనాలు కానిచ్చారు. దీనిపై జంతు ప్రేమికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘‘ అది కిరాతకం. రోడ్డు మధ్యలో జనాలు అంతా చూస్తుండగా, పైగా అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఓ జంతువును నరికి చంపేశారు. ఓ మూగజీవి ప్రాణాలను హరించటమే కాదు.. పబ్లిక్ న్యూసెన్స్ చేశారంటూ’’ ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసినట్లు కన్నూర్ పోలీస్ చీఫ్ శివ కుమార్ తెలిపాడు.
గోవధ ను కఠినతరం చేస్తూ చేస్తున్న చట్టాలపై దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ నిబంధనలు కొనసాగిస్తుండగా, కేరళ లాంటి రాష్ట్రాలు ప్రజా వ్యతిరేక తీర్మానాలను ఆమోదించటం లేదు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ... గోవధ, గొడ్డు మాంసం అమ్మకాలపై చట్టాలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశాడు. మరోవైపు కాంగ్రెస్ యువ విభాగం చేసిన ఈ పనిని ఖండిస్తున్నట్లు రాహుల్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more