సర్వసాధారణంగా కొందరు వ్యక్తులు స్వామీజీల వేషంలో తమ భక్తులను బురిడీ కొట్టించి వారి నుంచి నగదు నట్రాలను కైవసం చేసుకుంటారు. ఇలాంటి ఘటనలను మనం అనేకం చూశాం. విన్నాం కూడా. అయితే నిత్యం స్వామీజీలు భక్తులను బురిడీ కొట్టించడం ఏంటని భావించిందో ఏమో తెలియదు కానీ.. ఓ భక్తురాలు ఏకంగా స్వామీజీకే పంగనామాలు పెట్టింది. ఓ స్వామీజీ వద్ద భక్తురాలిగా చేరి, ఆయన్ను నమ్మించి మోసం చేసిందో మాయలాడి. దీంతో తనకు న్యాయం చేయాల్సిందిగా.. ఆ స్వామీజి పోలీసులను అశ్రయించారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబరు 5లో నివాసం ఉంటున్న శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి వద్ద అరుణారెడ్డి అనే మహిళ భక్తురాలిగా వచ్చి, నమ్మకమైన శిష్యురాలిగా మారింది. మార్చి 20న మహర్షికి చెందిన ఇన్నోవా వాహనం టీఎస్ 09ఏక్యూ టీ/ఆర్ 2001 వెనక్కి తీస్తుండగా వాహనం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. దీంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. అరుణారెడ్డి వాహనాన్ని రెండు రోజుల్లో బాగు చేయిస్తానని చెప్పి మహర్షిని నమ్మించి తనతోపాటు తీసుకెళ్లింది. మరమ్మతుల బదులు ఏకంగా కారును తాకట్టు పెట్టింది.
విషయం తెలియని స్వామీజీ అమెకు ఫోన్ చేసి కారు తీసుకురమ్మని ఎన్నిసార్లు అడిగినా మాయమాటలు చెబుతూ ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసింది. దీంతో ఆమె వైఖరిపై అనుమానం వచ్చిన చాముండేశ్వర మహర్షి, ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది. తన కారును తనకు నమ్మకంగా మెసలిన భక్తురాలే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లిందని తెలిసి.. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే స్వామీజి శిష్యురాలికి ఈ తరహాలో నేరాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు దర్యాప్తులో తెలిసి విస్మయానికి గురయ్యారు. అమెపై ఇదే తరహా కేసులు మల్కాజ్ గిరి, నారాయణగూడలతో పాటు నల్గొండలోనూ నమోదై ఉన్నాయని గుర్తించారు. ఇటీవలే అరుణారెడ్డి మల్కాజ్ గిరిలో ఓ వ్యక్తిని మోసం చేయడంతో అమెను మల్కాజ్ గిరి పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా తెలుసుకున్నారు. అయితే జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదు చేసిన కేసులో అరుణారెడ్డికి పిటీ జారీ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more