క్రితం తరం సినిమాలలో పెళ్లి జరుగుతుందనగానే శరామామూలుగా వినిపించే డైలాగ్.. ఆపండి.. పెళ్లి కూతురు మెఢలో తాళి కట్టే శుభవేళ.. బంధువర్గం. మిత్రబృందం అందరూ నోరెళ్లపెట్టి షాక్ కు గురై వెనువెంటనే తేరుకుని.. అప్పటి వరకు వున్న ఉత్సాహం అవిరై నీరుగారి కళవిహీనమైన ముఖంతో పోలీసుల చెంత చేరి ఏంకండీ అని అడగగానే మీ అమ్మాయి అదృష్టవంతురాలు. మరోలా చెప్పాలంటే మీరు కూడా అదృష్టవంతులే. వాడు నేరస్తుడు. ఓ అమ్మాయితో సహజీవనం చేసి.. ఆరేళ్ల వారి పయనంలో పలు సార్లు శారీరికంగా కలిసిన తరువాత కూడా ఆ యువతిని మోసం చేసి మరో పెళ్లికి సిద్దమయ్యాడని పోలీసుల తెలిపారు.
దీంతో పెళ్లికి వచ్చిన అతిధులతో పాటు మండపంలో వున్న వధువు తరపు బంధువులుగా వెంటనే నిలదీయండంతో వరుడి తరపు బంధువులు అరోపణలన్నీ అసత్యం అని వాదిస్తుండగానే పోలీసులు వరుడ్ని అదుపులోకి తీసుకుని బైసర్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని బైసర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు తన బంధువైన 24 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని చెబుతూ గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్య అతని తీరులో తేడా వచ్చింది. గుట్టుగా మరో యువతిని వివాహం చేసుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ విషయం ఆమెకు ఎలాగోలా తెలియడంతో చివరి క్షణంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
చిన్ననాటి నుంచే పరిచయం ఉన్న తామిద్దరం ప్రేమించుకున్నామని, అందుకే సహజీవనం చేశామని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానన్నాడు కనుకే తాను సహజీవనం చేశానని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, సరిగ్గా తాళి కట్టే సమయానికి కల్యాణ మంటపంలోకి ఎంట్రీ ఇచ్చి... 'ఆపండి' అంటూ పీటల మీద ఉన్న పెళ్లి కొడుక్కి సంకెళ్లు వేశారు. ఆరేళ్లుగా ఆ యువతిపై అతను అత్యాచారం చేశాడని చెబుతూ, మోసం, అత్యాచారం వంటి నేరాలపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more