పెళ్లంటే నూరేళ్ల పంట.. తమ జీవితంలోకి జీవిత భాగస్వామి వచ్చే శుభతరుణం. ఇలాంటి కార్యక్రమాలు అత్యంత పవిత్రంగా సాగుతాయి, కానీ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన యువత పెళ్లితో పెద్వవాడు అవుతున్నాడని, అందుకనే తన స్నేహితులకు బ్యాచిలెర్ పార్టీ కూడా ఇచ్చేస్తుంటారు. అయితే ఇది తప్పు కాదన్న భావన యువకుల్లో వుండగా, యువతులు మాత్రం మద్యం సేవించడం క్షమించరాని నేరంగా పరిగణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వధువులు తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలతో పీటలెక్కిన పెళ్లిళ్లు కూడా నిలిచిపోతున్నాయి.
మరీ అదే మధ్యపాన నిషేదమున్న రాష్ట్రంలో.. తాళి కట్టడం మాత్రమే మిగిలివున్నా.. వరుడు మధ్యం సేవించాడన్న కారణంగా ఏకంగా పెళ్లిని రద్దు చేసుకుందో వధువు. తాగుబోతు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, అతడ్ని వివాహం చేసుకోనని తేల్చి చెప్పి పెళ్లిని రద్దు చేసింది. బిహార్ లోని బక్సార్ జిల్లా సుజాత్పూర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బిట్టు పాండే(24)కు రాణి కుమారిని ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు భావించారు. పెళ్లి పనులన్నీ పూర్తిచేసి.. కళ్యాణానికి అంతా సిద్దమయ్యారు.
మూడు ముళ్లు వేయాల్సిన శుభతరుణం రానేవచ్చింది. అంతే ఆ వరుడ్ని తాను పెళ్లి చేసుకోనని వధువు ఛీకొట్టింది. బిట్టును పెళ్లిచేసుకోనని, అతడు మద్యం సేవించి ఉన్నాడని.. అందుకే సరిగ్గా తాను నిల్చోలేక పోయాడని రాణి తన బంధువులకు వివరించింది. ఆమె పెద్దలు ఇందుకు సమ్మతించారు. జీలకర్ర పెట్టిన తర్వాత పెళ్లి ఆగిపోవడంతో పెళ్లికి వచ్చిన బంధువులు, సన్నిహితులు షాకయ్యారు. అయితే వదువు తరపు బంధువు జై నిశ్వాస్ స్పందిస్తూ.. మద్యనిషేధం అములులో ఉండగా.. ఎవరైనా మద్యం సేవించినట్లు అధికారులు గుర్తిస్తే దాదాపు పదేళ్లపాటు జైలుశిక్ష పడుతుందని వధువు ఇలా చేసిందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more