తన భర్త మరణం వార్తను గుండె నిబ్బరంతో చదివి ప్రపంచానికి తెలియజేసిన ఛత్తీస్ గఢ్ ఐబీసీ 24 న్యూస్ ఛానెల్ గురుప్రీత్ కౌర్ ఉదంతం తెలిసిందే. దు:ఖాన్ని దిగమింగుకుని వృత్తి ధర్మంను పాటించి ఆపై తన భర్త శవం దగ్గరికి బయలుదేరిన ఆమెపై పలువురు ప్రశంసలు కురిపించారు. అయితే ఈ ఉదంతం వెలుగు చూసిన కొద్ది గంటలకే ఇక్కడ మరో న్యూస్ ప్రజెంటర్ వ్యవహారం చక్కర్లు కొడుతుంది. అయితే మొదటి సందర్భం విషాదం అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది కాస్త ఫన్నీయే.
ఆస్ట్రేలియా వార్త సంస్థ ఏబీసీ 24 చానెల్కు చెందిన నటాషా అనే ఆ యాంకర్ బులిటెన్ ను చదువుతోంది. ఇంతలో మానిటర్ లో వార్త ప్రజెంటేషన్ అవుతుండగా, తాను లైవ్లో ఉన్న విషయాన్ని మరచిపోయి గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. ఇంతలో కెమెరా ఆన్ అయిందన్న విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే కవర్ చేస్తూ స్పోర్ట్స్ న్యూస్ చూద్దామంటూ బులెటిన్ను కొనసాగించింది.
న్యూస్ ప్రజెంటర్లు వార్తలు చదువుతున్న క్రమంలో విజువల్స్ వస్తున్నప్పుడు, బ్రేక్ సమయంలో కాస్త రిలాక్స్ అవుతారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒక్కోసారి కెమెరా ఆన్ అయిందన్న విషయం తెలుసుకోకుండా ఇలాంటి బ్లూఫర్ వీడియోలతో నవ్విస్తుంటారు. అయితే అనుకోకుండా జరిగినప్పటికీ విధి నిర్వహణలో అప్రమత్తంగా లేదన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది సదరు ఛానెల్. ఇంతకు ముందు చైనా అధ్యక్షుడి పేరు తప్పుగా ఉచ్ఛరించినందుకు ఓ డీడీ యాంకర్ ను, ఓ చావు వార్త నవ్వుతూ చదివినందుకు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ తమ రీడర్ ను తొలగించిన ఉదంతాలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more