ప్రేమకు రెండు మనస్సులను దగ్గర చేయడంతో పాటు రెండు జీవితాలను ఒక్కటి చేసి.. వారిని బతికించే ధైర్యం ఇస్తుందని పెద్దలంటారు. కానీ దేశంలో ఉగ్రవాదం కారణంగా బలవుతున్నవారికంటే ప్రేమ వల్ల అసువులు బాస్తున్న వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువని విస్తుగొలిపే విషయాలను తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2001-2015 మధ్య గణాంకాలను విశ్లేషించినప్పుడు ఈ కఠోర వాస్తవం బయపడింది. ఈ మధ్యకాలంలో దేశంలో 38,585 హత్యలు, ద్వేషపూరిత హత్యల కేసులు నమోదయ్యాయి. అలాగే 79,189 ఆత్మహత్యలు, 2.6 లక్షల కిడ్నాపులు నమోదయ్యాయి. పెళ్లే లక్ష్యంగా ఈ కిడ్నాపులు జరగడం గమనార్హం.
వీటిలో సగటున ఏడు హత్య కేసులు, 14 ఆత్మహత్యలు, 47 కిడ్నాపులకు ప్రధాన కారణం ప్రేమ. ఇక ఇదే కాలంలో ఉగ్రవాదం కారణంగా 20 వేలమంది మరణించారు. వీరిలో సామాన్య పౌరులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఇక ప్రేమ కారణంగా ఎక్కువమంది హత్యకు గురవుతున్న వారిలో ఉమ్మడిగా వున్న తెలుగురాష్ట్రం కూడా వుందన్న విషయం అందోళన కలిగిస్తుంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా) నిలిచింది. 2001-15 మధ్య కాలంలో పైన చెప్పుకున్న రాష్ట్రాల్లో 3 వేల కేసులు నమోదయ్యాయి. ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసులకు ఏదో రకంగా ప్రేమతో లింకులు ఉండడం గమనార్హం.
ఇక ప్రేమ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారు పశ్చిమబెంగాల్లోనే ఎక్కువ. అక్కడ 14 ఏళ్ల కాలంలో (2012 గణాంకాలు లభ్యం కాలేదు) ఏకంగా 15 వేల మంది ప్రేమ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 9,405 ఆత్మహత్యలతో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా అస్సాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో 5 వేల మంది చొప్పున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారితో పోలిస్తే ప్రేమ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ఆరు రెట్లు అధికమని గణాంకాలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more