యూఎష్ లో మళ్లీ జాతి వివక్ష.. హైదరాబాదీ ఇంజనీర్ ను కాల్చి చంపారు | Racism In America again killed Indian.

Indian shot dead by american spewing racial slurs in kansas

Kansas City bar, Racism Shoot, Indian shot dead by American, Olathe Austins shoot, Racial Slurs, Hyderabad Engineer America, Alok Madasani, Srinivas Kuchibhotla,

The shooting incident comes at a time when hate crimes and acts of bigotry have risen notably during the recent months in America.A bartender at Austins Bar and Grill in Oathe, Kansas, said that Adam Purinton, 51, used "racial slurs" before he started shooting on Wednesday night as patrons were watching the University of Kansas-TCU basketball game on television. Srinivas Kuchibhotla, 32, from Hyderabad, died at an area hospital, police said. Alok Madasani, 32, and Ian Grillot, 24, were hospitalized and are in stable condition, they said. Witnesses said Grillot had stepped in and tried to stop the shooter. The Linked-in accounts for Kuchibhotla and Madasani say that they were engineers working at GPS-maker Garmin, who had studied in India.

ITEMVIDEOS:నా దేశం విడిచిపో.. అంటూ చంపేశాడు

Posted: 02/24/2017 09:31 AM IST
Indian shot dead by american spewing racial slurs in kansas

అగ్రరాజ్యంలో జాతి వివక్ష మరోసారి పడగ విప్పింది. ఈసారి మాత్రం ఓ తెలుగువాడి ప్రాణం తీసింది. బార్‌లో జరిగిన వాగ్యుద్ధంలో రెచ్చిపోయిన అమెరికన్ ఓ తెలుగు వ్యక్తిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి కాన్సస్ రాష్ట్రంలోని ఓలెత్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్‌’లో తెలుగువారైన శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిలతో ఆడమ్ ప్యూరిన్టన్ అనే వ్యక్తి ‘మీరు నాకంటే ఎందులో గొప్పో’ చెప్పాలంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో తాగిన మత్తులో ఉన్న ప్యూరిన్టన్ ను బార్ సిబ్బంది బయటకు పంపించేశారు.

అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే తుపాకితో తిరిగొచ్చిన ప్యూరిన్టన్ శ్రీనివాస్, అలోక్‌ లపై కాల్పులు జరిపాడు. కాల్పులకు ముందు ‘మా దేశం వదిలిపోండి.. టెర్రరిస్ట్’ అని అరిచాడని, జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక కాల్పులు జరుపుతున్న ప్యూరిన్టన్‌ను అడ్డుకునేందుకు ఇయాన్ గ్రిల్లోట్ అనే అమెరికన్ ప్రయత్నించడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. అతడి చేయి, భుజంలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కూచిభొట్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అలోక్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ గార్మిన్ కంపెనీ ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ టీంలో పనిచేస్తున్నట్టు సమాచారం. కాల్పుల ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ బార్‌లో దాక్కునేందుకు ప్రయత్నించిన ప్యూరిన్టన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

 

కాగా దుండగుడి కాల్పులకు బలైన శ్రీనివాస్ కూచిభొట్ల 2005లో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఏవియేషన్ ప్రోగ్రాంలో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకున్న అలోక్ మాడసాని గార్మిన్ కంపెనీలో ఏవియేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

మేజేజ్ మెంట్ దిగ్భ్రాంతి...

గార్మిన్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లారీ మైనార్డ్‌ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ కంపెనీ తరుపున ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆస్టిన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌ లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో మన ఏవియేషన్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోలోని పనిచేస్తున్న శ్రీనివాస్‌ కూచిబొట్ల దురదృష్టవశాత్తు కన్నుమూశాడు. మరో సహచరుడు అలోక్‌ మాదసాని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అలోక్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. శ్రీనివాస్‌ మృతిపట్ల కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. వారి కుటుంబాలకు ధైర్యంగా ఉండాలి. మేం వారికి అండగా ఉంటాం’ అని ఆ ప్రకటనతో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Racial Slurs  Kansas City bar  Fire  Indian Dead  

Other Articles