ప్రత్యేక హోదా కోసం ఆంధ్రరాష్ట్ర యువత పోరుబాట పట్టింది. యువత, విద్యార్థులు, ప్రజలు ప్రత్యేక హోదాకు సై అంటూ కదం తొక్కుతున్నారు. వైజాగ్లో ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిషేధాజ్ఞలు విధించినా.. వాటిని ధిక్కరించి పోరుకు సై అంటు కదిలారు. ఆంధ్రప్రదేశ్ అంతటా హోదా నినాదం హోరెత్తుతూనే ఉంది. హోదా కోసం ప్రజలు ఇంతగా తపిస్తున్నా అధికారంలో ఉన్న నేతలకు ప్రజాకాంక్ష ఏమాత్రం పట్టినట్టు కనిపించడం లేదు. కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి ప్రత్యేక హోదా అవసరమే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
'ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం. ఇంకా దాని గురించి మాట్లాడడం అనవరం' అంటూ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొనే వారు ఏ కోళ్లపందాలో, పందుల పందాలో నిర్వహించుకోవాలని ఆయన నోరుపారేసుకోవడంతో.. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే సుజనా చౌదరి వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ ఘాటుగా స్పందించగా.. సోషల్ మీడియాలో సైతం సుజన, సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది.
ఇప్పటికే కేంద్రమంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. "హోదాను అడ్డుకోవాలని చూస్తున్న సుజనా చౌదరే పంది" అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పందివైన నీతోనే గేమ్ మొదలు పెడతామని హెచ్చరించాడు. హోదా కోసం పోరాడుతున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని, అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని అన్నాడు. విద్యార్థుల అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని చెప్పుకొచ్చాడు.
సుజనా చౌదరి వ్యాఖ్యలపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ‘యువత పోరాట స్ఫూర్తిని "సుజనా చౌదరి గారు" పందుల పందేలతో పోల్చడం చాలా బాధాకరం..’ అని ఆయన ట్వీట్ చేశారు. మీరు నోరు జారే కొద్దీ యువతని రెచ్చగొట్టటమే అవుతుందని, సరే అలాగే కానివ్వండని ఆయన పేర్కొన్నారు. మనల్ని వెటకారం చేసే గల్లీ స్థాయి నాయకుడి నుంచి ఢిల్లీ స్థాయి నాయకుడి దాక ప్రతి ఒక్కరినీ ఆంధ్రలోని ప్రతి యువకుడు, యువతి గుర్తు పెట్టుకోండని పవన్ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more