ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూలు బస్సును ఎదరుగా వస్తున్న ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఎతాహ్ జిల్లా అలీగంజ్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు ఫ్రైవేటు స్కూలు బస్సును ఎదురుగా ఢీకొన్నడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది విద్యార్థులు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ట్రక్కును ఢీకొన్న తర్వాత బస్సు రోడ్డు పక్కకు పల్టీలు కొట్టింది. పోలీసులు, అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేప్టటారు. గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మృతితో ఘటనాస్థలితో పాటు అసుపత్రి అవరణ ఆసాంతం విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధులు అర్తనాధాలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రాన్ని తలపించింది. ప్రమాదానికి గల కారణాలేంటి? బస్సు ఎక్కడికి వెళ్తోంది? వంటి విషయాలు తెలియాల్సివుంది. అయితే రోడ్డు ప్రమాదానికి మంచు కారణమని తెలుస్తుంది. మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు.
కాగా ఘటనాస్థలంలో 8 మంది విద్యార్థులు మృత్యువాత పడగా, మరో 7 మంది విద్యార్థులు అస్పత్రిలో మరణించినట్లు వైద్యులు తెలిపారు. వీరు మార్గమధ్యంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థానాన్ని పరిశీలించిన ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ జావెద్ అహ్మద్ పాఠశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో చల్లగాలులు అధికంగా వీస్తుండటంతో పాఠశాలలకు సెలవులను ప్రకటించినా.. నిభంధనలకు విరుద్దంగా పాఠశాలను నడిపించి.. 15 మంది విద్యార్థులు ప్రాణాలను పాఠశాల యాజమాన్యం బలిగొనిందని జావెద్ అహ్మద్ అన్నారు.
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి అఖిలేష్ సంతాపం
ఉత్తర్ ప్రదేశ్ లోని ఎతాహ్ జిల్లా అలీగంజ్ పట్టణంలో సంభవించిన రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బిడ్డలను కొల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిన వ్యక్తం చేసిన ప్రధాని, వారి మనోవేధనను తాను అర్థు చేసుకున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయాలపాలైన చిన్నారి విద్యార్థులు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఘటనపై విచారణకు అదేశించిన ఆయన.. క్షతగాత్రులకు అధునాతన చికిత్సను అందించాలని అస్పత్రులను అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more