కెప్టెన్గా తన చిట్టచివరి మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపాడు. ఇంగ్లండ్ లెవెన్తో ముంబైలో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో ది బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. మునుపటి ధోనీని గుర్తుకు తెస్తూ బ్యాట్తో రెచ్చిపోయాడు. ధోని క్రీజులో వుండి మైదానంలోని నలుదిశలా షాట్లు కోడుతూవుంటే.. ధోని అభిమానులు మాత్రం స్టేడియంలో పెద్దపెట్టున ఈలలు, కేకలు, అరుపులతో హల్ చల్ చేశారు. అమ అభిమాన క్రికెటర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని సంతోషంలో మునిగితేలారు.
ఇక మరోవైపు టీమిండియా జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ తో పాటు అంబటి రాయుడు కూడా ప్రాక్టీసు మ్యాచ్ లో తమ సత్తాను చాటుకున్నారు. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న యాభై ఓవర్ల డే అండ్ నైట్ వార్మప్ మ్యాచ్లో రాయుడు శతకం సాధించాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.
రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్లో బ్యాటింగ్కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువరాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లు జాక్ బాల్, డేవిడ్ విల్లీ రెండేసి వికెట్లు తీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more